సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: అవే షేర్లు నిలబెట్టాయ్
Published on Wed, 06/24/2026 - 15:54
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద, సెన్సెక్స్ 1.04 శాతం లేదా 790.54 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడ్డాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రెంట్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.39 శాతం పెరిగాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ 2 శాతానికి పైగా లాభంతో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. మరొవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1