Breaking News

వెండికి హాల్‌మార్కింగ్‌.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్‌

Published on Sat, 11/29/2025 - 08:29

బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించేలా దాని పరిధిని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా సహజ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మధ్య వ్యత్యాసాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయడానికి, ఈ విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది.

వెండికి హాల్‌మార్కింగ్

జూన్ 2021 నుంచి బంగారు ఆభరణాలకు తప్పనిసరి అయిన హాల్‌మార్కింగ్‌ వెండి ఆభరణాల కోసం సెప్టెంబర్ 1, 2025 నుంచి స్వచ్ఛందంగా ప్రవేశపెట్టబడింది. అయితే దీన్ని రానున్న రోజుల్లో తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఇటీవల సీఐఐ నిర్వహించిన రత్నాలు, ఆభరణాల సదస్సులో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. బంగారు హాల్‌మార్కింగ్‌కు పరిశ్రమ, వినియోగదారుల నుంచి లభించిన సానుకూల స్పందన ప్రభుత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. ‘వెండి హాల్‌మార్కింగ్‌ను స్వచ్ఛందంగా చేయడం ద్వారా దాని ఫలితం, ప్రజల స్పందన ఎలా ఉందో పరిశీలిస్తున్నాం. వెండి ఆభరణాలను సైతం ధరించే మన దేశంలోని వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల విశ్వసనీయతను నిర్ధారించడం చాలా ముఖ్యం’ అని ఖరే అన్నారు. వెండి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడానికి ముందు పరిశ్రమ ప్రతిస్పందనకు తగినంత సమయం ఇస్తున్నామని వివరించారు.

తప్పనిసరి హాల్‌మార్కింగ్‌(బంగారానికి) ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 57.17 కోట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 8.44 కోట్ల వస్తువులకు హాల్‌మార్క్‌ వేసినట్లు పేర్కొన్నారు.

బీఐఎస్ పరిధిలో..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో ఈ హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా ఆభరణాల వ్యాపారులు, 65 లైసెన్స్ పొందిన రిఫైనర్లు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు. అస్సేయింగ్ హాల్‌మార్కింగ్‌ సెంటర్ల (AHL) విస్తరణను కూడా ప్రభుత్వ పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా 1,603 బీఐఎస్ గుర్తింపు పొందిన ఏహెచ్‌ఎల్‌లు, 109 ఆఫ్ సైట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో దేన్నీ ప్రభుత్వం నిర్వహించకపోవడం గమనార్హం.

ల్యాబ్ గ్రోన్ డైమండ్లపై పారదర్శకత

సాంకేతికత అభివృద్ధి చెందడంతో ల్యాబ్ గ్రోన్ డైమండ్లు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారాయి. అయితే, సహజ వజ్రాల కంటే అవి చౌకగా ఉన్నందున వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి పారదర్శకతను నిర్ధారించేలా ఫ్రేమ్‌వర్క్‌ అవసరమని ఖరే నొక్కి చెప్పారు. పరిశ్రమపై భారం పడకుండా పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్ కౌన్సిల్(GJEPC), ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)