Breaking News

‘ఆర్‌సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’

Published on Thu, 03/26/2026 - 13:34

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం మారిన నేపథ్యంలో ఆ జట్టు వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు రూ.16,500 కోట్లకు ఈ ఫ్రాంచైజీ విక్రయించిన తర్వాత మాల్యా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం’ అని పేర్కొన్నారు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మాల్యా ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు (సుమారు 111.6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను 2008లో ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుతూ ఇది కేవలం ఒక ‘వానిటీ ప్రాజెక్ట్’(ప్రదర్శన కోసం చేసే ఖర్చు) అని విమర్శించారు. కానీ నా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే నా ఉద్దేశం. అందుకే జట్టుకు ఆ పేరు పెట్టాను. ఈ రోజు ఆర్‌సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవడం గర్వంగా ఉంది’ అని మాల్యా ఎక్స్‌ (ట్విట్టర్)లో రాశారు.

కోహ్లీ ఎంపికే నా విజయం!

ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన అత్యుత్తమ నిర్ణయమని మాల్యా అభివర్ణించారు. 18 ఏళ్ల క్రితం ఒక కుర్రాడిగా కోహ్లీని గుర్తించి జట్టులో చేర్చుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలను జట్టులోకి తీసుకురావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

నూతన యాజమాన్యం

ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్ట్ వెంచర్స్) రూ.16,660 కోట్లకు ఆర్‌సీబీని కైవసం చేసుకుంది. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇకపై ఈ ఫ్రాంచైజీకి సారథ్యం వహించనున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు ప్రాంఛైజీలోని తన వాటాను విక్రయించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

#

Tags : 1

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)