Breaking News

భారత్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్స్‌ ఇవే..!

Published on Thu, 12/30/2021 - 21:28

భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు  సందడి చేస్తున్నాయి.  ఇంధన ధరలు వీపరితంగా పెరిగిపోవడంతో సాంప్రదాయ వాహనాలకు బదులుగా ఈవీ వాహనాలవైపు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. వాహన కొనుగోలుదారులతో పాటుగా ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీ ఆదరణను నోచుకుంటున్నాయి.  

ఇక భారత్‌లో ఇప్పటివరకు సుమారు 10 కార్లకు పైగా ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో హ్యుందాయ్‌, టాటా, ఎంజీ మోటార్స్‌, మహీంద్రా లాంటి ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. కాగా వీటిలో భారత్‌లో అత్యంత సరసమైన ధరలకే వస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్ల గురించి తెలుసుకుందాం...

భారత్‌లో అత్యంత తక్కువ ధరకే వస్తోన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

1. టాటా-టిగోర్‌
ప్రముఖ భారత ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ రెండు ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేసింది. వాటిలో టాటా టిగోర్ జిప్ట్రాన్ కాంపాక్ట్ సెడాన్  అత్యంత తక్కువ ధరకే రానుంది. ఈ కారులో 26 kWh బ్యాటరీను  కంపెనీ ఏర్పాటుచేసింది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే సుమారు 306 కి.మీ. మేర ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. ల వరకు ప్రయాణిస్తుంది. 15 ఆంపియర్ వాల్ అడాప్టర్‌ సహాయంతో  ఈ కారును 80 శాతానికి ఛార్జ్ చేయడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. అయితే డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే 80 శాతం బ్యాటరీని కేవలం ఒక గంటలోపే ఛార్జ్‌ చేయవచ్చును. ఈ కారు 74 bhp సామర్థ్యంతో 170 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది.  దీని ధర రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది.

2. టాటా-నెక్సాన్‌
టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన రెండో ఎలక్ట్రిక్‌ వాహనం టాటా నెక్సాన్ ఈవీ. ఇది భారతీయ ఈవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్. దీనిలో 30.2 kWh బ్యాటరీను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీని కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 127 bhp సామర్థ్యంతో 245ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది.  దీని ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది. 

3. ఎంజీ మోటార్స్‌- ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ
ప్రముఖ బ్రిటన్‌ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ భారత్‌లోని ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ కారును ప్రవేశపెట్టింది. 2021 కొద్ది మార్పులతో ఈ కారున ఎంజీ మోటార్స్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ కారు 44kWh బ్యాటరీతో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 419 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోందనీ కంపెనీ పేర్కొంది. 15 amp ఛార్జర్‌తో సుమారు 17 నుంచి 18 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. అయితే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో ఈ కారును  50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీను ఛార్జ్‌ చేయవచ్చును. ఈ కారు 142  bhp సామర్థ్యంతో 353 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది. దీని ధర రూ. 20.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది. 

4. హ్యుందాయ్‌-కోనా
దక్షిణ కొరియన్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్స్‌ భారత్‌లోకి కోనా పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని రిలీజ్‌ చేసింది. భారత ఈవీ మార్కెట్లలో లాంచైనా తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీగా హ్యుందాయ్‌ కోనా నిలిచింది. 39.2 kWh బ్యాటరీతో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. కేవలం ఒక గంటలోపు 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఈ కారు 134  bhp సామర్థ్యంతో 395 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది దీని రూ. 23.79 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుంది.

చదవండి: హ్యుందాయ్‌ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
చదవండి:  పేరుకు సెకండ్‌ హ్యాండ్‌ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్‌ ఇవే..!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)