Breaking News

మార్జిన్‌ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

Published on Thu, 11/13/2025 - 08:30

మార్కెట్లపై ఆశావహ ధోరణి నెలకొన్న నేపథ్యంలో మార్జిన్‌ ట్రేడింగ్‌ ఫెసిలిటీ (ఎంటీఎఫ్‌)పై ఇన్వెస్టర్లలో గణనీయంగా ఆసక్తి పెరుగుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ చీఫ్‌ డిజిటల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ఆశీష్‌ నందా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమవ్యాప్తంగా సగటున రూ.77,180 కోట్లుగా ఉన్న ఎంఎటీఎఫ్‌ రుణాలు ఆగస్టులో రూ.1 లక్ష కోట్ల స్థాయికి చేరడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.85,000 కోట్లుగా ఉన్న రుణాలు, ఈ ఏడాది తొలినాళ్లలో మార్కెట్‌ కరెక్షన్‌కి లోనైనప్పుడు రూ. 71,000 కోట్లకు తగ్గినప్పటికీ, ఆ తర్వాత మార్కెట్లతో పాటు చాలా వేగంగా పుంజుకున్నట్లు నందా వివరించారు.

అయితే, చూడటానికి భారీగా అనిపిస్తున్నా, దేశీయంగా ఎంటీఎఫ్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దీని వాటా కేవలం 0.1 శాతమేనని నందా వివరించారు. అదే అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో ఇది 1.6 శాతంగా, చైనాలో 2.7 శాతంగా ఉన్నట్లు చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్‌ విస్తరణకు మరింతగా అవకాశాలు ఉండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. ఎంటీఎఫ్‌ విధానంలో షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తాన్ని మార్జిన్‌గా కడితే, బ్రోకరేజీ సంస్థలు దానికి తగ్గ నిష్పత్తిలో మిగతా మొత్తాన్ని రుణంగా సమకూరుస్తాయి. దానిపై వడ్డీ వసూలు చేస్తాయి.  మరిన్ని ముఖ్యాంశాలు ఆశీష్‌ నందా మాటల్లోనే ..

తక్కువ రిస్క్‌లు..

రిటైల్‌ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ బ్రోకర్లు ఎంటీఎఫ్‌ను మరింత అందుబాటులోకి తేవడంతో దీనికి మరింత ప్రాచుర్యం పెరిగింది. అలాగే, వడ్డీ రేట్ల విషయంలోనూ పోటీ పెరిగింది. కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు అత్యంత తక్కువగా 9.5 శాతం–9.75 శాతం శ్రేణిలో కూడా వడ్డీ రేటుకు దీన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. డెరివేటివ్స్‌లో లభించే మార్జిన్‌ ఫెసిలిటీతో పోలిస్తే స్టాక్స్‌కి సంబంధించిన ఎంటీఎఫ్‌లో రిస్క్‌లు కాస్త తక్కువ ఉంటాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ఇది 5–50 రెట్ల వరకు లభిస్తే, స్టాక్స్‌ విషయంలో లీవరేజీ 2–4 రెట్లు మాత్రమే ఉంటుంది. పైగా స్ట్రయిక్‌ ప్రైస్, ఎక్స్‌పైరీ డేట్‌తో ముగిసిపోయే సంక్లిష్టమైన ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులతో పోలిస్తే షేర్లు మన చేతిలో ఉండటం కాస్త భరోసానిచ్చే విషయంగా ఉంటుంది.

1,200 స్టాక్స్‌కి మాత్రమే అందుబాటులో..

సుమారు 6,500 పైగా లిస్టెడ్‌ స్టాక్స్‌ ఉన్నప్పటికీ 1,200 షేర్లకు మాత్రమే ఎంటీఎఫ్‌ వెసులుబాటు ఉంది. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే చాలా మటుకు స్టాక్స్‌కి ఈ సదుపాయం ఉండదు. షేరు రేట్లను బట్టి మార్జిన్‌ అవసరాలనేవి మారిపోతుంటాయి. రిస్కు చేసి ఎక్కువ మార్జిన్‌ తీసుకుందామనుకున్నా, నియంత్రణ సంస్థ నిర్దిష్ట పరిమితులు విధించడం వల్ల బ్రోకర్లు కూడా ఒక స్థాయికి మించి రుణం ఇవ్వడానికి కుదరదు. టీసీఎస్, టాటా మోటర్స్, రిలయన్స్, జియోలాంటి కొన్ని స్టాక్స్‌లో తప్ప టాప్‌ స్టాక్స్‌లో కూడా లీవరేజీ తక్కువగానే ఉంటోంది కాబట్టి ప్రస్తుతానికైతే దీనివల్ల వ్యవస్థాగతమైన రిసు్కలేమీ లేవు. ఈ నేపథ్యంలో ఎంటీఎఫ్‌కి దేశీయంగా క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యవస్థకు మూలస్తంభంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీన్ని గురించి కూలంకషంగా తెలుసుకుని, రిసు్కల గురించి స్పష్టంగా అర్థం చేసుకుని, క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన

Videos

Gadwal District: బస్సు టైర్లపై అధిక ఒత్తిడి పడటంతో లీకైన గాలి

Red Fort: ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు

అంబటి రాంబాబుపై దౌర్జన్యం చేసిన సీఐ వెంకటేశ్వర్లు

గెలుపు మాదే..! 20 వేల మెజారిటీ పక్కా..!!

Kakani: ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క YSRCP నేతకు ధన్యవాదాలు

Praja Udyamam: పెనుకొండలో ఉష శ్రీ చరణ్ బైక్ ర్యాలీ

దేవుడి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ధూళిపాళ్ల అనుచరుడు

ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఢిల్లీ పేలుడు.. ఉమర్‌ డైరీలో షాకింగ్‌ విషయాలు

Vijayawada: ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఈ ప్రజా ఉద్యమంతో కళ్ళు తెరవండి

Photos

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)