Breaking News

భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..

Published on Mon, 06/02/2025 - 17:55

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగినట్లు వార్షిక నివేదికలో తెలిపారు. దాంతో ఆయన వేతనం రూ.80.6 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఆయన వేతనం పెరుగుదలకు ప్రధాన కారణం తనకు అనుసంధానించిన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్‌యూ), ఈక్విటీ విలువ పెరగడమేనని తెలిపింది.

2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌కు పోటీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో వంటి కంపెనీ సీఈఓల వేతనం కంటే కూడా సలీల్‌ ప్యాకేజీ అధికంగా ఉండడం గమనార్హం. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారుగా ఉన్న టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పలియా వేతనం 10 శాతం పెరిగి 6.2 మిలియన్ డాలర్లకు లేదా సుమారు రూ.53.6 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ పారితోషికం రూ.71 కోట్ల నుంచి రూ.56 కోట్లకు తగ్గింది.

ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తయారీ లేనట్లే!

సలీల్‌ పరేఖ్‌ స్టాక్ ఆప్షన్ల ద్వారా రూ.49.5 కోట్లు ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లుగా ఉంది. బేస్ పే కింద రూ.7.5 కోట్లు, రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.50 లక్షలు పొందారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.19.8 కోట్లుగా ఉన్న ఆయన వేరియబుల్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.23.2 కోట్లకు పెరిగింది. కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం రూ.10.72 లక్షలుగా ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ రంగాల్లో ఇన్ఫోసిస్ అగ్రగామిగా ఉందని వాటాదారులకు రాసిన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ 15,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుందని, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 3,20,000 మందికి పైగా ఉద్యోగులున్నట్లు తెలిపారు.

Videos

టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!

నారాయణరెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన YS జగన్

ఆ రోజు మానవజాతి శ్వాస ఆగిపోతుందా?

పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడికి కారణం అదే.. మోదీ కీలక వ్యాఖ్యలు

Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!

విశాఖలో రెచ్చిపోతున్న PDS రైస్ మాఫియా

జోగులాంబ గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత

Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది

చిరు, వెంకీ మల్టీస్టారర్ ఫిక్స్ ఇక బాక్సాఫీస్ బద్దలే..

Photos

+5

'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)

+5

అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)

+5

ఇంజనీరింగ్‌ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్‌ బ్రిడ్జి (ఫొటోలు)

+5

Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ వివాహం (ఫోటోలు)

+5

సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)

+5

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైన గిల్ సేన‌ (ఫోటోలు)

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)