Breaking News

అంత సీన్‌ లేదు! బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఉంటుంది.. 

Published on Fri, 05/26/2023 - 08:34

న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఒకటి, రెండు సంస్థల గుత్తాధిపత్యానికి అవకాశం లేదని ఆ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థిరమైన కంపెనీగా అవతరించనుందని చెప్పారు. వొడాఫోన్‌ ఐడియా సంస్థ కస్టమర్లను కోల్పోతూ, ఆర్థికంగా బలహీనపడుతుండడంతో, టెలికం రంగం ఇక ద్విఛత్రాధిపత్యం (డ్యుయోపలీ) కిందకు వెళుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో మంత్రి స్పందించారు. ఈ ఆందోళలను ఆయన తోసిపుచ్చారు.

ప్రస్తుతం టెలికం మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతోపాటు, ప్రభుత్వరంగం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ పరంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నిలదొక్కుకుంటున్నట్టు మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణ లాభాలను ప్రస్తుతం ఆర్జిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ది టర్న్‌అరౌండ్‌ స్టోరీ (పరిస్థితి మారిపోవడం). బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత 4జీ, 5జీ టెక్నాలజీని వినియోగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక పరిజ్ఞానాల కంటే మెరుగైనవి’’అని మంత్రి వివరించారు.

నాలుగు సంస్థలు వర్ధిల్లుతాయా లేక మూడు రాణిస్తూ, ఒకటి సమస్యలను ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్నకు మార్కెట్‌ నిర్ణయిస్తుందన్నారు. సరైన ఏర్పాట్లు, వసతులు ఉంటే వచ్చే ఐదేళ్లలో భారత్‌ అతిపెద్ద సెమీ కండక్టర్‌ తయారీ కేంద్రంగా అవతరిస్తుందంటూ, ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్‌ పరిశ్రమకు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించడం తెలిసిందే.

ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..

Videos

కాశ్మీర్ అంశంపై ట్రంప్ ఆఫర్.. నో చెప్పిన మోదీ

ఉ అంటావా సాంగ్ మీరు మిస్ చేసుకోవడం వల్లే సమంత చేసిందా?

సైన్యం కోసం విజయ్ దేవరకొండ

జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

పాక్ ఫేక్ ప్రచార సారధి ఓ ఉగ్రవాది కొడుకు

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

పాకిస్థాన్ ని ఉగ్రవాదుల నిలయంగా మార్చేసిన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్.. భారత వజ్రాయుధాలకు పాక్ గజగజ

జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఉషశ్రీచరణ్

యుద్ధానికి మా సైన్యం పనికిరాదు.. పాక్ ప్రజల రియాక్షన్

Photos

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)

+5

‘#సింగిల్‌’ మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మిస్‌ వరల్డ్‌ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)