Breaking News

ఆర్ధిక వ్యవస్థలో భారత్.. జర్మనీని అధిగమించాలంటే?

Published on Thu, 01/01/2026 - 12:49

2025 చివరి నాటికి భారతదేశం జపాన్‌ను అధిగమించి.. ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సమీక్ష ప్రకారం.. ఇండియా జీడీపీ 4.18 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక మన దేశం ముందున్న టార్గెట్ జర్మనీని అధిగమించడమే.

అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగవ స్థానంలో నిలిచిన భారత్.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఇప్పుడు నాలుగవ స్థానం నుంచి జర్మనీని అధిగమించి.. మూడో స్థానంలోకి చేరుకోవడానికి గట్టిగా కృషి చేయాలి. దేశం మరింత సమృద్ధిగా మారాలి. 2030 నాటికి భారత్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లక్షలాది ఉద్యోగాలు అవసరం
జనాభా పరంగా.. భారతదేశం 2023లో దాని పొరుగు దేశమైన చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో మాత్రం నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2024లో భారతదేశ తలసరి జీడీపీ 2,694 డాలర్లుగా ఉంది. ఇది జపాన్ కంటే 12 రెట్లు, జర్మనీ కంటే 20 రెట్లు తక్కువ.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది 10-26 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. కాబట్టి దేశం లక్షలాది మంది యువ గ్రాడ్యుయేట్లకు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది.

రూపాయి పతనం & ఆర్థిక సవాళ్లు
అమెరికాతో వాణిజ్య ఒప్పందం లేకపోవడం, దేశ వస్తువులపై సుంకాల ప్రభావం గురించి కొనసాగుతున్న ఆందోళనల కారణంగా, డిసెంబర్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ భారీగా తగ్గింది. 2025లో రూపాయి విలువ దాదాపు ఐదు శాతం పడిపోయింది.

2047 నాటికి..
ప్రస్తుతం.. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఈ ఊపును ఇదే మాదిరిగా కొనసాగిస్తూ.. 2047 నాటికి (స్వాతంత్య్రం వచ్చి వందేళ్ల సందర్భంగా) అధిక మధ్య ఆదాయ స్థితిని సాధించాలనే ఆశయంతో, దేశం ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు & సామాజిక పురోగతి యొక్క బలమైన పునాదులపై నిర్మిస్తోంది" అని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు