Breaking News

‘గ్రీన్‌’ ఎనర్జీలో 1.5 లక్షల కోట్లు ఆదా

Published on Tue, 09/23/2025 - 08:24

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు, సేవల పన్ను(GST) సంస్కరణలు పునరుత్పాదక ఇంధన(renewable energy) రంగంలో భారీ పొదుపునకు తెరతీయనున్నట్లు మంత్రి ప్రహ్లాద్‌ జోషీ పేర్కొన్నారు. దీంతో 2030కల్లా రెనెవబుల్‌ ఎనర్జీ రంగంలో రూ.1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు ఇది నవరాత్రి కానుకగా జీఎస్‌టీ సంస్కరణల అమలు తొలి రోజు నూతన, పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోకూడిన జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్ను రేట్ల తగ్గింపునకు నిర్ణయించడంతో 2030కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న భారత్‌ భారీ లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన 6వ అంతర్జాతీయ ఇంధన సదస్సు సందర్భంగా విలేకరులతో మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.  

చౌకగా రూఫ్‌టాప్‌ సోలార్‌  

ప్రధానంగా నవరాత్రి తొలిరోజు రెనెవబుల్స్‌ పరికరాలపై జీఎస్‌టీ రేట్లు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు జోషీ చెప్పారు. రెనెవబుల్‌ పరికరాలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 5 శాతానికి దిగివచి్చనట్లు వెల్లడించారు. దీంతో ఇన్వెస్టర్లకు 2030కల్లా రూ. లక్ష కోట్ల నుంచి 1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు తెలియజేశారు. 2030కల్లా భారత్‌ 300 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ప్రస్తావించారు. దీనిలో భాగంగా 2–3 శాతం వ్యయాలు ఆదా అయినప్పటికీ రూ. 1–1.5 లక్షల కోట్లమేర పెట్టుబడులలో పొదుపునకు వీలుంటుందని వివరించారు. 

పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంలో భాగంగా 3 కేడబ్ల్యూ సిస్టమ్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ రూ. 9,000–10,500మేర చౌక కానున్నట్లు వెల్లడించారు. పీఎం కుసుమ్‌లో భాగంగా 10 లక్షల సోలార్‌ పంప్‌ల ద్వారా రైతులకు రూ. 1,750 కోట్లమేర ఆదాకానున్నట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి: స్టాక్‌ మార్కెట్లే ఇప్పుడు దిక్కు

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)