Breaking News

ఫేస్‌బుక్‌లో హింస ఈ రేంజ్‌లో ఉందా!?

Published on Wed, 09/01/2021 - 11:52

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్‌ పీస్‌ (ఇమేజ్‌)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. 

యూజర్లు సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్‌ బుక్‌ గత కొంత కాలంగా యూజర‍్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్‌ బుక్‌ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్‌, కంటెంట్‌లపై కన్నేసింది. ఈ రెండింటిలో  ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్‌ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో 8  పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. 

సోషల్‌ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా?
కరోనా కారణంగా సోషల్‌ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్‌ కోసం ఫేస్‌బుక్‌ను  ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్‌బుక్‌ స్పోక్‌ పర్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్‌ కంటెంట్‌, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్‌ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్‌ మెంట్‌ కంటెంట్‌ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.       

ఫేస్‌బుక్కే కాదు.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కూడా.. 
ఫేస్‌బుక్కే కాదు..ఇన్‌ స్టాగ్రామ్‌ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్‌, సెల్ఫ్‌ ఇంజూరీ ఇమేజ్‌ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్‌ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

వాట్సాప్‌ లో సైతం
ఫేస్‌బుక్‌ కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్ ఫామ్‌ వాట్సాప్‌లో  జూన్‌ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్‌ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది.  

చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)