Breaking News

యాపిల్‌ తిక్క కుదిరింది.. ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లింపు

Published on Sat, 11/13/2021 - 15:11

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తిక్క కుదిరింది. యాపిల్‌ తన స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు కోర్టు ఉత్తర్వుల మేరకు 29.9 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం తర్వాత కోర్టులో ఉన్న ఓ వ్యవహారం కొలిక్కి రావడంతో ఉద్యోగులకు ఈ పరిహారం లభించింది. అసలు విషయానికి వస్తే.. యాపిల్‌  స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు తమ విధులు ముగించుకొని వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. అయితే, ఈ తనిఖీ ఉద్యోగులు పని సమయం ముగిసిన తర్వాత చేసేవారు. వారేమైనా బ్యాగుల వంటివి తెచ్చుకుంటే వాటిని కూడా నిశితంగా పరిశీలించేవారు.

దీని వల్ల స్టోర్ల వద్ద ఎక్కువ సమయం పట్టేది. అయితే, కంపెనీ మాత్రం ఈ సమయానికి ఎటువంటి చెల్లింపులు చేసేది కాదు. ఈ తనిఖీ చేయడానికి పట్టే సమయానికి డబ్బులు చెల్లించకపోవడం అనేది కాలిఫోర్నియా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారు. దీనిపై గళం విప్పిన ఉద్యోగులు 2013లో కోర్టును ఆశ్రయించారు కార్మికులు ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలించి తమ బ్యాగుల్లో దాచకుండా చేయడానికి బ్యాగ్ తనిఖీ అవసరమని యాపిల్‌ పేర్కొంది. ఈ పాలసీని ఇష్టపడని ఎవరైనా పనికి బ్యాగులను తీసుకురాకూడదని కోర్టులో వాదించింది. 2015లో ఒక న్యాయస్థానం ఉద్యోగుల వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కానీ, వారు మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం కాలిఫోర్నియాలోని 52 యాపిల్‌ స్టోర్లలో కార్మికులను మాత్రమే వర్తించింది. ఈ యాపిల్‌ స్టోర్లలో 14,683 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 1,286 డాలర్లు లభిస్తాయని న్యాయవాదులు కోర్టు ఫైలింగ్ లో తెలిపారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మాట్లాడటానికి యాపిల్ నిరాకరించింది. డిసెంబర్ 2015లో ఉద్యోగులను తనిఖీ చేసే విధానాన్ని నిలిపివేసినట్లు కంపెనీ ఒప్పందంలో తెలిపింది.

(చదవండి: ఆర్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!)

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)