Breaking News

ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా 

Published on Sat, 08/27/2022 - 12:04

పెనుకొండ: ‘రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. అందుకే జనమంతా వైఎస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అండగా నిలుస్తూ అపూర్వ విజయాన్ని అందిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత     చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

చివరకు తన సొంత నియోజకవర్గం ‘కుప్పం’లోనూ ఉనికి కోల్పోవడంతో రోడ్డుపై కూర్చుని ‘డ్రామా’కు తెరతీశారు’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అర్హత ఉంటే చాలు పథకం ఇంటికే నడిచి వస్తోందని, అందువల్లే ‘కుప్పం’ ప్రజలూ వైఎస్సార్‌ సీపీ వెంట నడుస్తున్నారన్నారు. ఈక్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టారన్నారు. దీంతో చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు.  

టీడీపీ కేడర్‌ కూడా వైఎస్సార్‌ సీపీలో చేరుతోండటంతో ఏం చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. టీడీపీ నేతలే అక్కడున్న వైఎస్సార్‌ సీపీ నేతల ఫ్లెక్సీలు చించి నానా హంగామా చేస్తే వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారని, దీంతో టీడీపీ నేతలే దాడి దిగారన్నారు. కానీ చంద్రబాబు, అతని అనుచరులు కుప్పంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులే...టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారన్నారు.

అంతేకాకుండా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ నిందలు వేశారని, ఇది చంద్రబాబు దిగుజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇక ‘కుప్పం’ ఘటనను సాకుగా చూపుతూ పలుచోట్ల టీడీపీ నేతలు శాంతిర్యాలీ పేరుతో జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమానికి సిద్ధమయ్యారన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని తన సొంత సర్వేలోనూ తేలడంతో చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు తెరలేపారన్నారు.

జగనన్న ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు తప్పును, చేతగాని తనాన్ని కప్పిపుచ్చడానికి ఆ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి ధర్నాల పేరుతో నానా యాగీ చేస్తున్నారని, ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్పితీరుతారన్నారు.

సమావేశంలో వైఎస్సార్‌ సీపీ సోమందేపల్లి మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్‌ వెంకటరత్నం, ఉప సర్పంచ్‌ వేణు, నాయకులు నరసింహమూర్తి, అశోక్, రామాంజనేయులు, ఇమాంవలి, వైస్‌ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, ఎస్‌ఎం బాషా,  ఎంపీ నాగరాజు, ట్రాక్టర్‌ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి: మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు)

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)