Breaking News

‘కరెంట్‌ కట్‌’ పైనా డైవర్షనే

Published on Wed, 12/31/2025 - 04:09

సాక్షి, అమరావతి: ప్రసిద్ధిగాంచిన విజయవాడ కనక­దుర్గమ్మ ఆలయాన్ని తొలిసారిగా చీకట్లు అలముకు­న్నా­యి. ఈ నెల 27న దాదాపు మూడున్నర గంటలపాటు దుర్గ గుడికి వి­ద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జరిగింది చిన్న పొరపాటు కాదు. చేసింది ప్రైవేటు సంస్థలో.. వ్యక్తు­లో కాదు. విజయవా­డ ప్రధాన కేంద్రంగా సీఆర్‌డీఏతో పాటు ఉమ్మడి గుంటూ­రు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు విద్యు­త్‌ సరఫరా చేసే ఏపీ సీపీడీసీఎల్‌. 

అదీగాక సాక్షాత్తూ కనకదుర్గ ఆలయానికి వి­ద్యు­త్‌ సరఫరా నిలిపివేయడమంటే అదేదో కిందిస్థాయి సి­బ్బ­­­ంది తీసుకునే నిర్ణయం కాదు. ఉన్నతాధికారుల అను­మతి తప్పనిసరి. కానీ.. మాకేం తెలి­యదంటూ ఎవరికివా­రు త­ప్పించుకునే ప్రయత్నం చేస్తు­న్నారు. దీనిపై ప్రతిపక్షా­లు దు­మ్మెత్తిపోయడంతో పా­టు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు­ండటంతో ప్రభు­త్వం పరువు పోయింది. 

నిర్లక్ష్యంపై 4 రో­­జులకు కళ్లు తెరి­చిన సీఎం చంద్రబాబు విద్యుత్‌ శాఖ మంత్రిని వివరణ కోరడంతో పాటు ఈ విషయాన్ని ‘డైవర్షన్‌’ చేయా­లని ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి గొట్టి­పా­­టి  మంగళవారం దుర్గగుడి ఈవో, విద్యుత్‌ అధికారు­లతో మ­­ంత్రి సమావేశమైన అనంతరం మీడియా ముందుకు వ­చ్చా­రు.  

అధికారులపై నెపం 
దుర్గగుడిలో విద్యుత్‌ అంతరాయం అంశాన్ని కొందరు రాజ­కీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు (వాస్తవంగా 3 గంటలు) విద్యుత్‌ అంతరాయం కలగడాని­కి గల కారణాలపై దేవదాయ, విద్యుత్‌ శాఖాధికారుల­తో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింద­న్నారు. 

దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారు­లను ఆదేశించినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలా­ంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చా­­రు. జనవరి 6, 7 తేదీల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గ గుడి ఈవో, ముఖ్య అధికారులతో కలిసి సమావేశం కానున్నట్టు ప్రక­టించారు.

పెద్దలకు తెలిసే.. 
దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంలో తమ తప్పే­మీ లేదంటున్న ప్రభుత్వం అధికారుల మీద నెపం నెట్టే­సే ప్రయత్నం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు అనంతరం దేవస్థానానికి చెందిన పది సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అప్పుడే సీఎంగానీ, మంత్రిగానీ దృష్టి సారించి ఉంటే ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డికి సైతం ఆలయ అధికారులు సమస్యను విన్నవించి పరిష్కరించాలని కోరారు. 

ఆయన ఏమాత్రం పట్టించుకున్నా ఇప్పుడిలా విద్యుత్‌ సరఫరా ఆగేది కాదు. అదీగాక దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా ఆపడమంటే అది కచ్చితంగా డిస్కం సీఎండీకి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి.. తీరా అభాసుపాలవ్వడంతో అధికారుల సమన్వయ లోపం వల్లే పొరపాటు జరిగిందంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సాంకేతిక వివరాలేవి? 
దేవస్థానం పరిధిలో ఉన్న సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. దీనికి కచ్చితంగా నెట్‌ మీటరింగ్‌ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. అది సక్రమంగా జరిగితే ఆ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌కు బదులుగా డిస్కం నుంచి విద్యుత్‌­ను వినియోగించుకున్నప్పటికీ ఎలాంటి విద్యుత్‌ బిల్లు చెల్లించే అవసరం రాకపోవచ్చు. కానీ.. ఏవో సాంకేతిక కారణాలను సాకుగా చూపించి రూ.3.08 కోట్ల బకాయిలు చెల్లించాలని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఇదేమీ గుట్టుగా ఉండే విషయం కాదు. ప్రతీదీ అధికారికంగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండాల్సిందే. కానీ.. ఇంతవరకూ బకాయిలకు సంబంధించిగానీ, నెట్‌ మీటరింగ్‌కు సంబంధించిగానీ అధికారిక పత్రాలను, వివరాలను విద్యుత్‌ శాఖ బయటపెట్టలేదు. మరోవైపు మూడున్నర గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే కేవలం 15 నిమిషాలేనంటూ విద్యుత్‌ శాఖ మంత్రి అసత్యాలు వల్లె వేస్తున్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)