Breaking News

మీకు ప్రాణభిక్ష పెట్టింది పోలీసులే,, ఆ విశ్వాసం మరిచి అసభ్యంగా తిడతారా? 

Published on Sun, 01/29/2023 - 04:40

చిత్తూరు రూరల్‌/కుప్పం(చిత్తూరు జిల్లా)/తిరుపతి మంగళం: టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని.. ఆ విశ్వాసం మరిచి ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చిత్తూరు జిల్లా పోలీసు యూనియన్‌ అసోసియేషన్‌ ధ్వజమెత్తింది. కుప్పంలో శుక్రవారం జరిగిన నారా లోకేశ్‌ పాదయాత్రలో అచ్చెన్నాయుడు పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడం పట్ల పోలీసు సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం వారు చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు ఉదయ్‌ మాట్లాడుతూ పోలీసులు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు.

ఆ విషయంలో దేశంలోనే రాష్ట్ర పోలీసుశాఖ మొదటిస్థానంలో ఉందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం లోకేశ్‌ పాదయాత్రకు దాదాపు 700 మంది భద్రత సిబ్బందిని కేటాయించిందన్నారు. అచ్చెన్నాయుడు పోలీసులపై అసభ్య పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. పోలీసులంతా తిండి కోసం రాలేదన్నారు. ఆయన సోదరుడు కూడా ఓ పోలీసు అధికారి అని.. ఈ మాట అతన్ని అడిగి మాట్లాడాలని సూచించారు.

గతంలో అచ్చెన్నాయుడిని కొందరు చితకబాది పడేసుంటే.. ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని గుర్తుచేశారు. ఇటీవల టీడీపీ నేతలంతా పోలీసులను తిట్టడం ఓ ఫ్యాషన్‌గా మార్చుకున్నార­ని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పోలీసులకు క్షమా­పణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిసి అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఖాదర్‌బాషా, శరవణ, రమేష్‌ పాల్గొన్నారు.  

కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు.. 
కులమతాలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా నిత్యం ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న పోలీసులను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించేదిలేదని పోలీసు అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఏపీ పోలీసు అసోసియేషన్‌ నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కుప్పంలో అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర సలహాదారు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులను లెక్కచేయకపోవడం వల్ల చంద్రబాబు సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసి పోలీసులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. 

అచ్చెన్నపై కేసు .. 
నారా లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారని సీఐ శ్రీధర్‌ వెల్లడించారు. కుప్పం ఎస్‌ఐ శివకుమార్‌ చేసిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. 

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)