Breaking News

డెంగీతో ఇద్దరు విద్యార్థుల మృతి

Published on Sat, 06/03/2023 - 00:22

శింగనమల: జిల్లాలో ఇద్దరు విద్యార్థులు డెంగీ జ్వరంతో మృతి చెందారు. శింగనమల మండలంలోని లోలూరు గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతూ వడ్డే ప్రవీణ్‌కుమార్‌ (7) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికుల వివరాలమేరకు... లోలూరుకు చెందిన వడ్డే రాజు, మేఘన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ఐదురోజుల క్రితం జ్వరం బారిన పడటంతో చుట్టు పక్కల ఉన్న ఆస్పత్రుల్లో చూపించారు. కాగా శుక్రవారం ఉదయం బాలుడి పరిస్థితి విషమించడంతో అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ప్రవీణ్‌కుమార్‌ మృతి చెందాడు.

వారం రోజులుగా జ్వరాలు

లోలూరు గ్రామంలో వారం రోజుల నుంచి చిన్నారులు, ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. శుక్రవారం మహమ్మద్‌ వయాజ్‌ అనే బాలుడికి అధిక జ్వరం రావడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. గ్రామంలో జ్వరాలు అధికంగా ఉన్నాయని, వైద్యులు వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

బొమ్మనహాళ్‌లో మరొకరు..

బొమ్మనహాళ్‌: మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో డెంగీ జ్వరంతో వన్నూరుస్వామి (13) అనే విద్యార్థి శుక్రవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీధరఘట్టకు చెందిన ఈరమ్మ, ధనుంజయ దంపతుల కుమారుడు వన్నూరుస్వామి (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేవాడు. వేసవి సెలవులు కావడంతో కర్ణాటకలోని బళ్లారి జిల్లా కోళగల్లులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి గత నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ తరువాత తీవ్రమైన జ్వరం రావడంతో కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు డెంగీగా నిర్ధారించి రెండురోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో వన్నూరుస్వామి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మృతుడు ప్రవీణ్‌కుమార్‌, వన్నూరుస్వామి (ఫైల్‌)

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)