ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
జ్యోతికి మరో స్వర్ణం
Published on Fri, 05/19/2023 - 06:10
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో విశాఖ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ మరోస్వర్ణాన్ని కై వసం చేసుకుంది. రాంచీలోని బిర్సా ముండా స్టేడియంలో గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల పరుగును 23.42 సెకన్లలో గమ్యాన్ని చేరి జ్యోతి (ఆంధ్రప్రదేశ్) విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. అర్చన సుసేన్ (తమిళనాడు) 23.61సెకన్లలోనూ, హిమాని చందల్ (మధ్యప్రదేశ్) 24.33 సెకన్లలో పూర్తి చేసి వరుసగా ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. సిమ్రాన్దీప్ కౌర్ (ఢిల్లీ), దనేశ్వరి (కర్నాటక), అంజలి(కేరళ), మధుమిత (ఒడిస్సా), శుభమ్ (హర్యానా) వరుసగా నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. ప్రిలిమ్స్ హీట్లో జ్యోతి 23.47సెకన్లలో పూర్తి చేసి ఫైనల్స్కు క్వాలిఫై అయింది. జాతీయ రికార్డు హోల్డర్ జ్యోతి బుధవారం జరిగిన వంద మీటర్ల హార్డిల్స్ను 12.89 సెకన్లలోనే పూర్తి చేసి స్వర్ణం సాధించిన విషయం విధితమే. దీంతో జ్యోతి పాల్గొన్న రెండు అంశాల్లో విజేతగా నిలిచి రెండు స్వర్ణాలందుకుంది. దీంతో జూలై 12–16 వరకు బాంకాంక్లో జరిగే ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్పై దృష్టి పెట్టింది.
Tags : 1