Breaking News

సూపర్‌ మార్కెట్లలో అడ్డగోలు రేట్లు..

Published on Tue, 04/28/2020 - 10:28

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాల ధరలు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. సూపర్‌ మార్కెట్లు వినియోగదారులను దోచేస్తున్నాయి. జనవరి నెలతో పోల్చితే ఏప్రిల్‌ చివరి వారం నాటికి ప్రజలు నిత్యం ఉపయోగించే పప్పులు, వంట దినుసుల ధరలు బాగా పెరిగాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం విస్మయానికి గురిచేస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రతి వస్తువును సాధారణ ధర కంటే సుమారు 20 నుంచి 30 శాతానికి పైగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. హైదరాబాద్‌ మహా నగరంలో హోల్‌ సేల్‌ నుంచి రిటైల్‌ కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దినసరి కూలీలకు, కార్మికులకు ఎలాంటి ఆదాయమూ లేకపోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. కొద్దో గొప్పో కొనుక్కోగలిగే స్థోమత ఉన్న మధ్య తరగతి ప్రజలు కూడా ధరాఘాతానికి వెనక్కి తగ్గక తప్పడం లేదు. బియ్యంతోపాటు వివిధ పప్పు దినుసులరేట్లకు అదుపు లేకుండా పోయింది. ఏకంగా ఉప్మా రవ్వ కిలో ధర రూ.45 నుంచి 55 పలుకుతుండగా కిలో చింతపండు ధర రూ.260లకు ఎగబాకింది. పెసర పప్పు కిలో ధర రూ.141కు పెరిగింది. హెచ్‌ఎంటీ రకం బియ్యం కిలో రూ.55 నుంచి 65 వరకు పలుకుతుండగా. మసూరి బియ్యం ధర కిలో 56 నుంచి 59, కర్నూలు రైస్‌ రూ 49 నుంచి 58 వరకు పలుకుతున్నాయి. 

కిరాణా షాపులకు బంద్‌
హైదరాబాద్‌లో ప్రధాన హోల్‌ సేల్‌ మార్కెట్లయిన బేగంబజార్, మలక్‌పేట్‌ మార్కెట్‌ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ కిరాణా షాపులకు సరఫరాను నిలిపి వేశారు. దీంతో సూపర్‌ మార్కెట్లకు డిమాండ్‌ పెరిగింది. గిరాకీని క్యాష్‌ చేసుకునేందుకు ఇక్కడ రేట్లు పెంచేశారు. అయినా అడిగే నాథుడు లేడు. మహానగరంలో గుజరాతీ, మార్వాడీలకు సంబధించిన కిరాణా దుకాణాలు  కొన్ని మూతపడటంతో సూపర్‌ మార్కెట్లకు మరింత కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా  హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపారులు సృష్టిస్తున్న కొరతతో ఒకవైపు ఎగబాకిన ధరలు, మరోవైపు కరోనా భయంతో కొందరు గుజరాతీ, మార్వాడీలు దుకాణాలు మూసివేసి ఫోన్‌ ఆర్డర్ల పైనే  తమ ఖాతాదారులకు సరుకులు డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు సూపర్‌ మార్కెట్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. రోజువారి నిత్యావసరాలైన గోధుమ పిండి, ఇడ్లీ..ఉప్మా రవ్వలు, టీ, కాఫీ పొడి, చక్కెర, పసుపు, నూనె, పప్పులు, సబ్బులు, హ్యాండ్‌వాష్‌ తదితర వాటికి డిమాండ్‌ బాగా పెరిగింది. 

ధరల నియంత్రణేది..?
లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినా...ధరలు అదుపులోకి మాత్రం రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్‌ సీఆర్వో ఆఫీస్‌లో ప్రత్యేక ల్యాండ్‌లైన్‌ ఏర్పాటు చేసి అధిక ధరలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయినా ఫలితం కన్పించడం లేదు. మరోవైపు తూనికలు..కొలతల శాఖ దాడులకు దిగి «కేసులు నమోదు చేస్తున్నా..ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. 

అధిక ధరలపై ఫిర్యాదు చేయండి...  
హైదరాబాద్‌ జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీస్‌: 040–23447770
తూనికల, కొలుతల శాఖ ఎమ్మార్పీ, తూకం మోసాలపై:  7330774444
టోల్‌ ఫ్రీ నెంబర్‌:   1800–42500333

Videos

Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం

గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సుధీర్‌రెడ్డి

స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి

Drugs Case: పదేళ్లు జైలు శిక్ష! అడ్వకేట్ షాకింగ్ కామెంట్స్

TS: సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

అమెరికా బలగాల అదుపులో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో

బర్సె దేవాతో పాటు లొంగిపోయిన మరో 20 మంది మావోయిస్టులు

East Godavari: రైస్ మిల్లర్ల భారీ మోసం... పవన్.. దమ్ముంటే ఇప్పుడు సీజ్ చెయ్

కూతురి సర్జరీ కోసం వెళితే.. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇది

బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Photos

+5

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే? (ఫొటోలు)

+5

కజిన్ పెళ్లిలో హృతిక్ రోషన్ సందడే సందడి (ఫొటోలు)

+5

‘సైక్‌ సిద్ధార్థ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్‌ (ఫొటోలు)

+5

మణికొండలో సందడి చేసిన నటి దివి వద్త్య (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మహా నగరంపై మంచు తెర..(ఫొటోలు)

+5

టీటీడీ విజిలెన్స్‌.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)