జూలైలో ఎగుమతులు జూమ్‌! 

Published on Fri, 08/14/2026 - 00:22

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌–ఇంజినీరింగ్‌ గూడ్స్, సముద్ర ఉత్పత్తుల దన్నులతో జూలైలో భారత్‌ ఎగుమతులు భారీగా ఎగబాకాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 19.63% వృద్ధితో 44.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 జూన్‌ (3.12% అప్‌) తర్వాత ఎగుమతులు ఈ స్థాయిలో వృద్ధి చెందడం ఇదే తొలిసారి. 

మరోపక్క, దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. 31.98 బిలియన్‌ డాలర్లను తాకింది. క్రూడాయిల్‌ అధిక దిగుమతుల ప్రభావంతో జూలైలో మొత్తం దిగుమతులు 17.52% ఎగసి 76.22 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలివీ.. 

→ జూలైలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 72–95 డాలర్ల మధ్యలో కదలాడింది. 17.64 శాతం పెరుగుదలతో 18.31 బిలియన్‌ డాలర్ల విలువైన ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో ఇది 24 శాతం కావడం గమనార్హం. 
→ పశ్చిమాసియా దేశాలకు కూడా జూలైలో ఎగుమతులు 8.62 శాతం పెరిగి 5.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
→ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 7 బిలియన్‌ డాలర్లకు (67.64 శాతం వృద్ధి), ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 6 బిలియన్‌ డాలర్లకు (57.4% అప్‌), ఇంజినీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతులు 12.24 బిలియన్‌ డాలర్లకు (17.7 శాతం వృద్ధి) చేరాయి. 
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూలై కాలంలో ఎగుమతులు 17 శాతం జంప్‌ చేసి 173.78 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు సైతం 19.27 శాతం ఎగసి 292.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 118.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 
→ కాగా, జూలై నెలలో సరీ్వసుల ఎగుమతులు 35.89 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 18.94 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

పసిడి దిగుమతులపై సుంకాల ఎఫెక్ట్‌
కస్టమ్స్‌ సుంకాల భారీ పెంపు ప్రభావంతో జూలైలో బంగారం, వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్‌ దిగుమతులు కేవలం 4.77% వృద్ధితో 4.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్‌ దిగుమతులు ఏకంగా 66.1% దిగజారి 171.68 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. మే 13న ఈ రెండు విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను 6% నుంచి 15%కి పెంచిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్‌–జూలై కాలంలో 15.17 బిలియన్‌ డాలర్ల (32.4% అప్‌) విలువైన పసిడి దిగుమతులు జరగ్గా... వెండి దిగుమతులు 50.8% ఎగసి 718.42 మిలియన్‌ డాలర్లను తాకాయి.  

అమెరికా, చైనాలకు రయ్‌... 
జూలైలో అమెరికాకు భారత్‌ నుంచి 9.02 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది జూలైతో పోలిస్తే 12.85% వృద్ధి చెందాయి. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 18.1% పెరిగి 5.5 బిలియన్‌ డాలర్లను తాకాయి. అమెరికా జూలై 24 నుంచి భారత్‌పై 10% అదనపు సుంకాలను విధించడం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక చైనాకు మన ఎగుమతులు 2.2 బిలియన్‌ డాలర్లకు (64.57% వృద్ధి) చేరాయి. దిగుమతులు 34.42% ఎగసి 14.67 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి..

#

Tags : 1

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)