Breaking News

హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే!

Published on Mon, 07/20/2026 - 16:10

భారతదేశంలో ప్రారంభమైన తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో హైడ్రోజన్ ఇంజిన్ రైలును.. డీజిల్ ఇంజిన్‌ లాగుతున్నట్లు కనిపిస్తుంది. దీనిపై రైల్వే స్పందించి క్లారిటీ ఇచ్చింది.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలై 17న ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనంతోనే నడుస్తుంది.

అయితే.. ఈ రైలుకు అవసరమైన మెయింటెనెన్స్ మొత్తం షకుర్‌బస్తీ వర్క్‌షాప్‌లో జరుగుతుంది. అందువల్ల జింద్ నుంచి షకుర్‌బస్తీ వరకు రైలును నడపకుండా, ఒక లోకోమోటివ్ సహాయంతో లాగి తీసుకెళ్తారు. ఇది చాలా కాలంగా అమలులో ఉన్న సాధారణ రైల్వే విధానం. కొందరు దీనిని చూసి హైడ్రోజన్ ఇంజిన్ చెడిపోయిందని తప్పుగా ప్రచారం చేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?

రైల్వే బోర్డు కూడా ముందుగానే విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో మాత్రమే స్వయంగా నడుస్తుందని, నిర్వహణ కోసం ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు లోకోమోటివ్‌తో లాగాలని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వైరల్ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రైల్వే వెల్లడించింది.

Videos

10 వేలతో 9 లక్షలు.. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్

గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు

2027 వరల్డ్ కప్.. రోహిత్, కోహ్లి ఫిక్స్.. షమీ, సిరాజ్ రీఎంట్రీ

అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు

చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్

మరో కొత్త జీవో..! ప్రభుత్వ ఉద్యోగుల పని ఖతం..?

రౌడీ షీటర్ సూరి హత్య కలకలం.. చంపింది నేనే..!

రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం

నేడు పొగాకు రైతులతో YS జగన్ భేటీ

హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్

Photos

+5

డిజైనర్ చీర.. మ్యాచింగ్ జ్యూయెల్లరీలో అనసూయ (ఫొటోలు)

+5

'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)