సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌ హాజరు

Published on Mon, 06/22/2026 - 16:53

సంధ్య థియేటర్‌ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్‌ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 

Videos

మళ్లీ తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

మరి ఇంత అహంకారామా? శ్రీలీలను అవమానించిన సీఎం భార్య

TG20 League 2026: అదిరిపోయే ఆరంభం..

పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నీపై పోటీ చేస్తా...

CI నాగరాజు ఇంటి వద్ద హైటెన్షన్

స్టార్ క్రికెటర్ల వేటకు శ్రీకారం..! హైదరాబాద్ లో క్రికెట్ జాతర

మొగుడే కాలయముడు!

రౌడీ షీటర్ అయితే బాబు ఎందుకు పరామర్శించాడు? కారణం ఇదే

టైటిల్ ఖమ్మం టీందే..!

దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ

Photos

+5

చీరలో తెలుగందం రీతూవర్మ (ఫొటోలు)

+5

లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)

+5

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)

+5

అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

+5

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు

+5

చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)

+5

సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్