పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
Breaking News
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
Published on Wed, 04/15/2026 - 12:34
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20 (వచ్చే సోమవారం) నుంచి సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుమారు 166 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని దిగుమతిదారులకు వాపసు ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది.
‘కేప్’ వ్యవస్థతో వేగంగా చెల్లింపులు
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ రీఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కేప్’ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఫైలింగ్లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ వివరాలను వెల్లడించారు. గతంలోలాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా, దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థను తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకు మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం
1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధమైన పరిధిని దాటి విధించిన సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.30 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,497 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపసు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లు.
ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!
Tags : 1