Breaking News

ఆ విధానం రద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం..!

Published on Thu, 04/02/2026 - 16:27

తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు.  మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్‌ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్‌ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.

పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్‌ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్‌ ఛాంబర్‌ తన ప్రకటనలో పేర్కొంది.

t

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)