సాయి పేరెంటరల్స్‌ @ రూ. 372–392

Published on Wed, 03/18/2026 - 00:36

హైదరాబాద్‌: డైవర్సిఫైడ్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.

కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్‌ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్‌ ఫార్ములేషన్ల బిజినెస్‌తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్‌ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు. 

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)