Breaking News

ఎరువుల దిగుమతి భారం తగ్గించేలా చర్యలు

Published on Mon, 01/26/2026 - 12:52

దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాబోయే బడ్జెట్‌లో ‘ఎరువుల స్వావలంబన మిషన్’ (Mission for Self Reliance in Fertilizer) పేరిట ఒక భారీ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ మిషన్ ద్వారా ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నారు.

లక్ష్యాలు, గడువు

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మిషన్ ద్వారా స్పష్టమైన కాలపరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఐదేళ్లలో ఎరువుల దిగుమతులను కనీసం 20 శాతం తగ్గించనున్నారు. పదేళ్లలో దిగుమతులను 35 శాతం వరకు కట్టడి చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఏటా వీటి విక్రయాలను 6–7 శాతం తగ్గించడం ద్వారా ప్రస్తుత మితిమీరిన వినియోగాన్ని అదుపులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

రికార్డు స్థాయికి చేరిన విక్రయాలు

  • 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం ఎరువుల విక్రయాలు 655.94 లక్షల టన్నులకు చేరి సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎరువుగా యూరియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూరియా విక్రయాలు 387.92 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.4 శాతం వృద్ధిని సూచిస్తుంది.

  • నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మిశ్రమంతో కూడిన సంక్లిష్ట ఎరువుల (NPK) వినియోగంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇవి 28.2 శాతం వృద్ధితో 149.72 లక్షల టన్నుల విక్రయాలను నమోదు చేశాయి.

  • పొటాష్ ఎరువుల విషయానికి వస్తే, ఎంఓపీ (మూరియేట్ ఆఫ్ పొటాష్) విక్రయాలు అత్యధికంగా 33.9 శాతం వృద్ధి చెంది 22.02 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.

  • అన్ని ఎరువుల విక్రయాలు పెరిగినప్పటికీ DAP (డై-అమోనియం ఫాస్ఫేట్) విక్రయాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. గతంలో 109.74 లక్షల టన్నులుగా ఉన్న DAP విక్రయాలు, ఈసారి 96.28 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. నవంబర్ మధ్య వరకు నెలకొన్న సరఫరా కొరత కారణంగానే ఈ తగ్గుదల నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సబ్సిడీ భారం.. సమన్వయ వ్యూహం

ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.1,67,899.5 కోట్లు కేటాయించింది. అయితే, ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువుల సబ్సిడీని రూ.49,000 కోట్ల నుంచి ఏకంగా రూ.75,000 కోట్లకు పెంచాల్సి వచ్చింది. ఈ భారీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

1. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ‘పీఎం-ప్రణామ్’ పథకాన్ని కొత్తగా రాబోయే ఎరువుల మిషన్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నారు.

2. ‘నేచరల్‌ ఫార్మింగ్‌ మిషన్’కు నిధుల కేటాయింపులను పెంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులను ప్రోత్సహించడం.

3. తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా కొత్త వంగడాలు, సాంకేతికతలను అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR)కి అప్పగించనున్నారు.

రసాయన ఎరువుల వాడకం పర్యావరణంపై, ప్రభుత్వ ఖజానాపై చూపుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ‘ఎరువుల మిషన్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Videos

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. జగన్ ట్వీట్

జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!

ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు

మంచు తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి

అడిగింది చెప్పు.. ఎక్స్ట్రాలు చెయ్యకు.. క్లాస్ పీకిన చంద్రబాబు

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

Photos

+5

ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

'బిగ్‌బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)

+5

వికసించిన పద్మాలు

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు