Breaking News

రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!

Published on Fri, 01/09/2026 - 20:45

కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

బీహార్‌కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.

ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.

ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.

#

Tags : 1

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)