Breaking News

హీరో విజ‌య్‌కు అండ‌గా ప్ర‌ముఖ లాయ‌ర్‌

Published on Thu, 01/08/2026 - 19:45

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ న‌టించిన తాజా చిత్రం జన నాయగన్ విడుద‌ల అనూహ్యంగా వాయిదా ప‌డింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి సెన్సార్ స‌ర్టిఫికెట్ రాక‌పోవ‌డంతో సినిమా అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల కావడం లేదు. మ‌ద్రాస్ హైకోర్టు నిర్ణ‌యంపై ఈ సినిమా విడుద‌ల ఆధార‌ప‌డి ఉంది. ముందుగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం జ‌న‌వ‌రి 9న జన నాయగన్ రిలీజ్ కావాల్సివుంది. అయితే మ‌ద్రాస్ హైకోర్టు త‌మ నిర్ణ‌యాన్ని అదేరోజు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్ప‌డంతో సినిమా విడుద‌ల పోస్ట్‌పోన్ అయింది. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు కోసం విజ‌య్ అభిమానులు, మ‌ద్ద‌తుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

జన నాయగన్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో నిశితంగా గ‌మ‌నిస్తున్నారు విజ‌య్ ఫ్యాన్స్‌. ఈ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌ర‌పున హైకోర్టులో వాద‌న‌లు విన్పిస్తున్న ప్ర‌ముఖ న్యాయ‌వాది స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్ (Satish Parasaran) గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో ఆయ‌న ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ మేన‌ల్లుడైన స‌తీశ్‌.. కోర్టులో ప‌దునైన వాద‌న‌ల‌తో సీబీఎఫ్‌సీ ప్ర‌తినిధుల‌కు దీటుగా కౌంట‌ర్ ఇస్తున్నార‌ని అభిమానులు అంటున్నారు.

ఎవ‌రీ స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్?
క‌మ‌ల‌హాస‌న్ సోద‌రి సరోజ కుమారుడే స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్. ఈయ‌న తండ్రి కె. పరాశరణ్ 1983-89 వరకు భారత అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి స‌తీశ్ న్యాయ‌విద్య పూర్తి చేశారు. త‌ర్వాత త‌మిళ‌నాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.

కమల్ హాసన్ (Kamal Haasan) సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ త‌ర‌పున కూడా ప‌లు సంద‌ర్భాల్లో కోర్టుల్లో వాద‌న‌లు వినిపించారు. క‌మ‌ల్ సినిమాలకు అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయ‌న కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవారు. గ‌త ఏడాది థగ్ లైఫ్ సినిమాను క‌ర్ణాట‌క‌లో నిషేధించిన‌ప్పుడు స‌తీశ్ ప‌రాశ‌ర‌ణే వాదించారు.

చ‌ద‌వండి: 'జన నాయగన్' వాయిదా.. భారీగా రీఫండ్‌

స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్‌పైనే ఆశ‌లు
ఇండియన్ 2 సెట్ ప్రమాదం విషయంలో క‌మ‌ల్‌హాస‌న్‌కు మద్రాస్ హైకోర్టు సమన్లు ​​జారీ చేసినప్పుడు కూడా ఆయ‌న త‌ర‌పున కేసు వాదించారు. 2020లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో ముగ్గురు వ్యక్తులు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా జన నాయగన్ సినిమా విడుద‌ల విష‌యంలో విజ‌య్ అభిమానులు స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్ వాద‌న‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. మద్రాస్ హైకోర్టు రేపు ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌రిస్తుందోన‌ని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 

Videos

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

శబరిమల బంగారం చోరీలో పురోగతి అర్చకుడు అరెస్ట్..

ఆస్కార్ కు అడుగు దూరంలో కాంతారా, మహావతార్..

Perni Nani: పార్టీలకు అతీతంగా మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం

టీటీడీ కల్యాణ మండపం గేట్లకు తాళాలు

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Photos

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)