క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
Breaking News
బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా?
Published on Sun, 01/04/2026 - 16:18
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్పై భారీ దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంఘటన (US attack on Venezuela) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం, వెండి ధరలపై ప్రభావం
భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతారు. ఈ దాడి కారణంగా అనిశ్చితి పెరిగి, సేఫ్ హెవెన్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత ధరలు (జనవరి 4 నాటికి భారత మార్కెట్లో) 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1,35,800 నుంచి రూ.1,37,000 వరకు (MCX ఫ్యూచర్స్ ప్రకారం) ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,24,500. ఇక వెండి కిలోకు సుమారు రూ.2,40,000 నుంచి రూ.2,46,000 వరకు ఉంది.
మరింత పెరిగే అవకాశం
నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు 4,380 నుంచి 4,500 డాలర్లకు చేరవచ్చు. భారత్లో 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉంది.
వెండి ధరలు మరింత గణనీయంగా పెరిగి, అంతర్జాతీయంగా ఔన్స్కు 75-78 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది సప్లై చైన్ డిస్టర్బెన్స్ (వెనెజువెలా ప్రాంత షిప్పింగ్ రూట్లు ప్రభావితం) కారణంగా కూడా జరుగవచ్చు. అయితే, ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చు. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా పడిపోవచ్చు. 2026లో మొత్తంగా బంగారం ధరలు ఔన్స్కు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags : 1