Breaking News

2.75 లక్షల యూజర్లు.. 1.3 లక్షల ఫిర్యాదులు

Published on Mon, 11/17/2025 - 14:00

వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ–జాగృతి ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై తమ పేర్లను నమోదు (రిజిస్టర్డ్‌ యూజర్లు) చేసుకున్నారు. ఇందులో 1,388 మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నారు.

ఫిర్యాదుల కోసం ఓసీఎంఎస్, ఈ–దాఖిల్, ఎన్‌సీడీఆర్‌సీ సీఎంఎస్, కాన్ఫోనెంట్‌ పోర్టళ్లు అందుబాటులో ఉండగా, వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఇ–జాగృతి ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకురావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు.

నవంబర్‌ 13 నాటికి 1,30,550 ఫిర్యాదులు దాఖలైనట్టు.. ఇందులో 1,27,058 ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచే తమ వినియోగ హక్కులను ఈ ప్లాట్‌పామ్‌ ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్‌తో భౌగోళిక పరమైన అవరోధాలు వారికి తొలగినట్టయిందని తెలిపింది. 

మీరూ ఫిర్యాదు చేస్తారా?

  • మొదట ఇ-జాగృతి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి

  • తొలిసారి యూజర్‌ అయితే, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, మీరు వినియోగదారా లేక ఇతరులా అన్న వివరాలు నమోదు చేయండి.

  • ఇప్పుడు వెరిఫికేషన్‌ ఓటీపీ ఎంటర్‌ చేసి పాస్‌వర్డ్‌ ఎంచుకోండి. చిరునామా, గుర్తింపు రుజువు వివరాలు ఇచ్చి రిజిస్టర్‌ పూర్తి చేయండి

  • కొత్త కంప్లయింట్‌ ఇలా..
    లాగిన్ అయిన తరువాత, మీ డ్యాష్ బోర్డ్ మీద "ఫైల్ న్యూ కేస్" ఎంచుకోండి. తర్వాత కేసు టైప్‌ను ఎంచుకుని ‘కన్స్యూమర్‌ కంప్లయింట్‌’పై క్లిక్‌ చేయండి.

  • ఇ‍ప్పుడు ఫిర్యాదు అవసరమైన డాక్యుమెంట్‌లు, రుసుము వివరాలు కనిపిస్తాయి.

  • వస్తువులు లేదా సేవల కోసం మీరు చెల్లించిన మొత్తం, ఇప్పుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారు, తేదీ, మీ రాష్ట్రం, జిల్లా, కేటగిరీ, సబ్‌ కేటగిరి తదితర వివరాలు నమోదు చేయండి.

  • కొనుగోలు రసీదులు, వారితో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వంటి డాక్యుమెంట్లను అ‌ప్‌లోడ్‌ చేయండి.

  • చివరగా మొత్తం వివరాలను ఒకసారి సరిచూసుకుని సంబంధిత రుసుము చెల్లించి సబ్‌మిట్‌ చేయండి.

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)