Breaking News

సినిమా టికెట్‌ ధర రూ. 200 దాటొద్దు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

Published on Wed, 07/16/2025 - 09:48

సినిమా టికెట్‌ ధరలు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనియాంశంగా ఉంటుంది. విషయంలో మన పొరుగు రాష్ట్రం కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కర్ణాటకలో విడుదలైన సినిమా బడ్జెట్ఎంతైనా సరే టికెట్ధర రూ. 200కు మించి ఉండకూడదని కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్స్‌తోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ ఇదే వర్తించనుందని పేర్కొంది. ఇతర భాష చిత్రాలకు కూడా ఇదే వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.

కన్నడ చిత్ర పరిశ్రమ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 బడ్జెట్ ప్రసంగంలో మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రతి షో టికెట్ ధరను రూ. 200కి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సామన్య ప్రజల నుంచి కన్నడ ప్రభుత్వంపై అభినందనలు వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులో వీకెండ్ టికెట్ రేట్లు భారీగా ఉంటాయి. ఏకంగా ఒక్కొ టికెట్ధర రూ. 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. దీంతో అక్కడ తీవ్రంగా వ్యతిరేఖత వచ్చింది. ఇప్పుడు దెబ్బతో రూ. 200 రూపాయలకు టికెట్ధర రానుంది. అయితే, పాప్ కార్న్ వంటి స్నాక్స్ధరలను కూడా తగ్గించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ
సినిమా టికెట్ధరలను ఇప్పుడు ఒక్కో రాష్ట్రం తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు కూడా ఇదే బాటలో అడుగులేస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేట్లు కాస్త ఎక్కువే వున్నాయి. పైగా స్పెషల్ షోలు, ప్రీమియర్లు అంటూ అదనపు రేట్లు వాయించేస్తున్నారు. అంశం మీద ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా కూడా చాలా చర్చలు నడిచాయి. కోర్టు కేసులు కూడా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ధరలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమ బతకాలన్నా, థియేట్రికల్ వ్యవస్థ కళకళలాడాలన్నా టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో తొలిసారి టికెట్ రేట్లను తగ్గించారు. అయితే, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి నచ్చలేదు. ఇప్పుడు వైఎస్ జగన్తీసుకున్న నిర్ణయమే కరెక్ట్అంటూ పలు వేదికల మీద వారే మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు కూడా టికెట్ధరలు నియంత్రించే పనిలో ఉండటంతో గతంలో వైఎస్ జగన్తీసుకున్న నిర్ణయం ఇదే కదా అంటూ గుర్తుచేస్తున్నారు. టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో వుండాలి అనేది జనం మాట.. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు అదనంగా పెంచుకుంటూ పోతే జనం థియేటర్కు దూరం అయిపోతారనేది థియేటర్ యజమానులు చెప్పే మాట. కానీ, నిర్మాతలు వాదన మరోలా ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేశాం.. డబ్బు అంతా మొదటి వారంలోనే రావాలని ఆశిస్తారు.

Videos

తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

హంద్రీనీవాపై చంద్రబాబు అబద్ధాలు

HCA అక్రమాలపై ఇవాళ రెండో రోజు విచారణ

రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

రిలీజ్ కు ముందే లాభాల్లో రాజాసాబ్..! ఇది ప్రభాస్ కెపాసిటీ

వెలిగొండ ప్రాజెక్ట్ పై పవన్ కు శ్యామల స్ట్రాంగ్ కౌంటర్

పహల్గాం ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన

హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం

ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు

కేవలం 14 నెలల్లో.. ఏపీని సుడాన్ గా మార్చేసిన బాబు సర్కార్

Photos

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)