Breaking News

‘ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ’ అంటే ..?

Published on Tue, 06/03/2025 - 12:01

సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్‌ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్‌ ఇచ్చినప్పుడు ‘షాక్‌ ట్రీట్‌మెంట్‌’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్‌మెంట్‌. బాధితులకు షాక్‌ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. 

సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్‌లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్‌ ట్రీట్‌మెంట్‌ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్‌ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...

షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... 
అసలు కరెంటు షాక్‌ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్‌ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్‌ / కన్వల్సెన్స్‌)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.

ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్‌ ఈసీటీ రూపంలో ... 
ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్‌ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్‌ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్‌ యాక్టింగ్‌) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్‌ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. 

ఇందులో బాధితులకు తమకు కరెంట్‌ షాక్‌ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. 

ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్‌పేషెంట్‌ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. 

మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. 

నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. 

ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్‌ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్‌ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. 

ఎలక్ట్రో కన్వల్సివ్‌ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...

నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు 
తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.

ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...
తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి సమస్యలు ఉన్నవారికి. 
ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్‌ టెండెన్సీస్‌ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. 
బైపోలార్‌ డిప్రెషన్‌ ఉన్న బాధితులకు 
మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... 
స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. 
కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. 

తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గా
తొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్‌ లొకేట్‌ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్‌లొకేషన్‌) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్‌ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.

ఈసీటీపై అపోహలూ వాస్తవాలు 
అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. 
వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. 
అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.
వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. 

ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. 
అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్‌ ప్రవహించవచ్చు. 
వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్‌ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. 
అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. 
వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. 
అపోహ: కరెంట్‌ షాక్‌ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. 
వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్‌ ట్రీట్‌మెంట్‌లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్‌ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్‌నెస్‌ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. 

అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.

ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...
నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. 

అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్‌ ఫ్లుయిడ్‌ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్‌క్రేనియల్‌ మాగ్నెటిక్‌ స్టిమ్యులైజేషన్‌ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. 
డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వైహెచ్‌వోడీ ఆఫ్‌ సైకియాట్రీ –సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్‌  

(చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్‌బీకి కూడా నచ్చవట..)

Videos

వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్

డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్

Trinamool: ఎంపీ రహస్య వివాహం

చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ

జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్

ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలి: 11 Fans Dead in Stampede

Photos

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కమల్‌ హాసన్ 'థగ్‌ లైఫ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)

+5

అంబరాన్నంటిన సిరిమాను సంబరం