శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే..!

Published on Wed, 06/26/2024 - 15:05

మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్‌ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్‌ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్‌, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్‌ ఇలా..

తొలి టీ20- జులై 27
రెండో టీ20- జులై 28
మూడో టీ20- జులై 30

తొలి వన్డే- ఆగస్ట్‌ 2
రెండో వన్డే- ఆగస్ట్‌ 4
మూడో వన్డే- ఆగస్ట్‌ 7

ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్‌ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.

తొలి టీ20- జులై 6
రెండో టీ20- జులై 7
మూడో టీ20- జులై 10
నాలుగో టీ20- జులై 13
ఐదో టీ20- జులై 14

జింబాబ్వే సిరీస్‌కు భారత జ‌ట్టు
శుభ్‌మ‌న్‌ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.

Videos

ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప

ఆ రోజే మరోసారి కరోనా ప్రళయం.. జపాన్ బాబా మరో సంచలనం

చనిపోయిన వారిని కూడా బదిలీ చేసిన సర్కారు

రోడ్లపై యువకుల హంగామా

పబ్లిసిటీ పీక్ ... పెర్ఫార్మెన్స్ పీక్

కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం

తల్లికి వందనం వేస్తారా లేదా? విద్యుత్ పోలెక్కి నిరసన

బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి

మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు YS జగన్ సందేశం

కూటమి ప్రభుత్వంలో గిరిజనుల అవస్థలు గుండెల్ని పిండేసే వీడియో

Photos

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)