-
కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక టీమ్ను లీడ్ చేయనున్నాడు. వికెట్కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ, తన స్వయం కృషితో సారధిగా నియమించబడ్డాడు. రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్.. 2019-20 సీజన్లో అండర్-14 క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా అన్న తరహాలోనే రాణించి, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అన్వయ్ కూడా తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనికి ముందు టీమిండియాకు సమర్ధవంతుడైన రెగ్యులర్ వికెట్కీపర్ లేకపోవడంతో ద్రవిడ్ చాన్నాళ్ల పాటు వికెట్కీపింగ్ భారాన్ని మోసాడు. ధోని రాకతో ద్రవిడ్ బ్యాటింగ్పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు. ద్రవిడ్ కోచింగ్లో భారత్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అతని ఆధ్వర్యంలో టీమిండియా.. న్యూజిలాండ్ను తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఓడించి, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జనవరి 21న రాయ్పూర్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. -
26 ఫోర్లతో డబుల్ సెంచరీ
బెంగళూరు: టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తండ్రిదగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండో డబుల్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. తన స్కూల్ మాల్యా అదితి ఇంటర్నేషనల్(ఎంఏఐ) తరపున బరిలోకి బ్యాట్ ఝళిపించాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ వన్ డివిజన్ 2 టోర్నమెంట్లో ద్విశతకంతో జూనియర్ ద్రవిడ్ చెలరేగాడు. కేవలం 144 బంతుల్లోనే 26 ఫోర్లు, సిక్సర్తో 211 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సమిత్ విజృంభణతో ఎంఏఐ టీమ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరు చేసింది. ఎంఏఐతో పోటీ పడిన బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ జట్టు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. క్రికెట్లో సత్తా చాటడం సమిత్ ద్రవిడ్ కొత్త కాదు. అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా గతేడాది డిసెంబర్ 20న జరిగిన మ్యాచ్లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరపున బరిలోకి సమిత్ డబుల్ సెంచరీ(201)తో మోత మోగించాడు. అండర్-12 విభాగంలో 2015లో జరిగిన టోర్నమెంట్లో మూడు అర్ధసెంచరీలు బాదడంతో సమిత్ పతాక శీర్షికలకు ఎక్కాడు. అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. (చదవండి: సచిన్ను గంగూలీ వదలట్లేదుగా!) -
అదరగొట్టిన ‘వాల్’ వారసుడు!
బెంగళూరు : టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు క్రికెటర్ల తనయుల పేర్లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరే వినిపించగా.. తాజాగా ద్రవిడ్ కొడుకు సైతం వార్తల్లో నిలిచాడు. బెంగళూరులో జరిగిన అండర్-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్ స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్పై సమిత్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ద్రవిడ్ అండర్-19 కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అండర్ 19 కోచ్ పెద్దకొడుకైన సమిత్.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్సీఏ) నిర్వహించిన బీటీఆర్ కప్లో సమిత్ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్గా గుర్తింపు కూడా పొందాడు. 2015లో అండర్-12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ పోటీల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ శ్రీలంక పర్యటనలోని భారత అండర్-19 జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్కు గొప్ప బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు -
ద్రావిడ్కు గొప్ప బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు
ముంబయి : భారత్ క్రికెట్కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో మిస్టర్ వాల్ (రాహుల్ ద్రావిడ్)ది ప్రత్యేక స్థానం. ఒదిగి ఉండే మనస్తత్వానికి, ఎలాంటి సమయంలోనూ చెక్కుచెదరని వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. ద్రావిడ్గా కంటే మిస్టర్వాల్గా, మిస్టర్ డిపెండబుల్గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. నేడు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'నిబద్ధత, నిలకడ, క్లాస్'వంటి గొప్పలక్షణాలు గల వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కానుక ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్కు ఇది తొలి విజయం కాగా, సరిగ్గా ఆయన పుట్టిన రోజుకు రెండు రోజులు ముందు కుమారుడు సమిత్ ద్రావిడ్ 150 పరుగులు చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆడుతున్న సమిత్ 150 పరుగులు చేసి తండ్రికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సమిత్ టీం మొత్తం 50 ఓవర్లలో 500/5 పరుగులు చేసింది. Commitment, Consistency, Class. Here's wishing a very Happy Birthday to Former #TeamIndia Skipper Rahul Dravid #HappyBirthdayDravid pic.twitter.com/FTgk1SjdT9 — BCCI (@BCCI) 11 January 2018 -
జూనియర్ ద్రవిడ్ వచ్చేశాడు!
స్కూల్ క్రికెట్లో సెంచరీ చేసిన సమిత్ బెంగళూరు: భారత మాజీ ఆటగాడు, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ బాటలోనే అతని కొడుకు కూడా పోటీ క్రికెట్లోకి దూసుకొస్తున్నాడు. అండర్-14 స్థాయి క్రికెట్లో ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న 11 ఏళ్ల సమిత్ ద్రవిడ్ ఈ సీజన్లో సెంచరీతో సత్తా చాటాడు. ‘టైగర్ కప్’ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు యునెటైడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్తో జరిగిన మ్యాచ్లో సమిత్ 125 పరుగులు సాధించాడు. సహచర ఆటగాడు ప్రత్యూష్ (143)తో కలిసి సమిత్ 213 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో బీయూసీసీ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత సంవత్సరం స్కూల్ క్రికెట్లో ఆకట్టుకున్న సమిత్, అండర్-12 విభాగం టోర్నీ గోపాలన్ క్రికెట్ చాలెంజ్లో ఉత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. తనతో పోలిస్తే సమిత్ బాగా దూకుడుగా ఆడతాడని, ప్రతీ బంతిని బాదే ప్రయత్నం చేస్తాడని కొన్నాళ్ల క్రితం స్వయంగా ద్రవిడ్ చెప్పుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తర్వాత ఇప్పుడు సమిత్ రాకతో మరో తరం వారసులు కూడా సిద్ధమైనట్లే. -
ద్రవిడ్ కొడుకు.. చితక్కొట్టాడు!
రాహుల్ ద్రవిడ్ అనగానే ద వాల్ అనే పేరు ఠక్కున గుర్తుకొస్తుంది. జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా కాపాడుకోవడమే కాక.. అత్యంత క్లాసీ షాట్లు ఆడటంలో ద్రవిడ్ను మించినవాళ్లు లేరని అంతర్జాతీయ క్రికెట్ పరిశీలకులు, విమర్శకులు కూడా చెబుతారు. అలాంటి ద్రవిడ్ కొడుకు.. అచ్చంగా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. గట్టిగా పదేళ్ల వయసు ఉందో లేదో.. అప్పుడే అండర్ -14 క్లబ్ క్రికెట్లో సెంచరీ బాదేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి. బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్మన్గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు. తన కొడుకు బ్యాటింగ్ తీరు పట్ల ద్రావిడ్ కూడా పొంగిపోతున్నాడు. అతడి కళ్లకు, చేతులకు మధ్య మంచి సమన్వయం ఉందని, బాల్ రాగానే దాన్ని స్మాష్ చేసేస్తాడని.. అలాగే చేయమని తాను కూడా చెబుతున్నానని ద్రావిడ్ అన్నాడు. ఎంతైనా పుత్రోత్సాహం కదా..! -
ద్రవిడ్ 'మార్క్'
మాజీ క్రికెటర్లకు బీసీసీఐలో పదవి అంటే కామధేనువు లాంటిదే. హోదా, గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలూ మామూలే. కానీ రాహుల్ ద్రవిడ్ అలాంటి పదవిని కాదన్నాడు. సలహా సంఘంలో ఉండటం కంటే కుర్రాళ్లను సానబెట్టడమే తనకు ఇష్టమన్నాడు. ప్రశాంతంగా సాగిపోయే పదవులకంటే... సవాల్ విసిరే కోచ్ పదవినే కోరుకున్నాడు. కొత్తతరాన్ని తయారు చేసే బాధ్యత తీసుకున్నాడు. శ్రీలంక సిరీస్ ద్వారా ఇప్పటికే ద్రవిడ్ ‘మార్క్’ కనబడింది కూడా. సాక్షి క్రీడా విభాగం : చదువులో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఎప్పుడైనా వెనుకబడితే తన లోపాలు సరిదిద్దుకునేందుకు, మళ్లీ టాప్లోకి వచ్చేందుకు తనకు ఇష్టమైన టీచర్ దగ్గరికి వెళ్లడం చూస్తుంటాం. ఇప్పుడు భారత క్రికెట్కు కూడా రాహుల్ ద్రవిడ్ అలాంటి గురువుగానే కనిపిస్తున్నాడు. పుజారా కావచ్చు లేదా రహానే కావచ్చు...కుర్రాడు లోకేశ్ రాహుల్ అయినా, ఇంకా టెస్టు ఆడని కరుణ్ నాయర్ అయినా కావచ్చు. ఇటీవల వీరందరి ఆటపై ద్రవిడ్ ప్రభావం ఉంది. వారంతా తమ ఆట ను మెరుగు పర్చుకునేందుకు ద్రవిడ్ను ఆశ్రయిం చారు. ఫలితం రాబట్టిన తర్వాత తమ వెనుక ‘వాల్’ ఉన్నాడంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అతని సూచనలతోనే ఒకప్పుడు శైలిలోనూ, టెక్నిక్లోనూ ద్రవిడ్ వారసుడు అంటూ చతేశ్వర్ పుజారా టెస్టు జట్టులోకి వచ్చాడు. చాలా వరకు ఆ అంచనాలను నిలబెట్టుకున్నా కొన్ని ఇన్నింగ్స్ల వైఫల్యంతో తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. కానీ ఇటీవల చెన్నైలో భారత్ ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్ అతని ఆటను ప్రత్యేకంగా పరీక్షించాడు. ‘పుజారా ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. అతని ఆటలో, టెక్నిక్లో ఎలాంటి లోపం లేదు. రాబోయే సిరీస్లో ఒక్క అవకాశం దక్కినా భారీ ఇన్నింగ్స్ ఖాయం’ అని విశ్లేషించిన ద్రవిడ్... పుజారాను ప్రోత్సహించాడు. ద్రవిడ్ మాటలు తనలో ఉత్సాహం నింపాయని, ఆయన ఇచ్చిన సూచనలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని కొలంబో సెంచరీ అనంతరం పుజారా వ్యాఖ్యానించాడు. నిజానికి పేరుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్నా... ఇండియా ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్నుంచి కోహ్లికి కూడా చక్కటి సలహాలు లభించాయి. ఇక రహానే అయితే రాజస్తాన్ రాయల్స్ జట్టులో కలిసి ఆడిన నాటినుంచి తన మంచి ప్రదర్శనకు కారణంగా ద్రవిడ్ పేరే చెబుతాడు. వెల్లింగ్టన్లో తన తొలి టెస్టు సెంచరీని రాహుల్కే అంకితమిచ్చిన అజింక్య... బ్యాటింగ్లో ఏ లోపం ఉన్నా ద్రవిడ్ దగ్గరికే పరిగెడతాడు. తన క్రికెట్ కెరీర్కు స్ఫూర్తిగా నిలిచిన ద్రవిడ్ వల్లే ఈ స్థాయికి చేరానని ప్రతీ సారి చెప్పే సహచర బెంగళూరు ఆటగాడు కేఎల్ రాహుల్... ఇటీవల ఇండియా ‘ఎ’ సిరీస్ సందర్భంగా ద్రవిడ్ మార్గదర్శనంలో తన బ్యాటింగ్ను మెరుగు పర్చుకున్నాడు. ఈ ముగ్గురి ఆటలో కచ్చితంగా ఎక్కడో ఒక చోట ద్రవిడ్ పోలికలు కనిపిస్తాయి. ఈ ముగ్గురూ శ్రీలంకలో ఆకట్టుకున్నారు. ఇంకా చాలా ఉంది ‘కోచ్గా ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఆటగాళ్లతో ఎలా ఉండాలి. ఏం మాట్లాడాలి. అసలు ఏ సమయంలో కల్పించుకోవాలి. ఏం చెబితే వారు ఇబ్బంది పడరో చూడాలి’ అంటూ ద్రవిడ్ తన శిక్షణపై స్వీయ అభిప్రాయం చెప్పాడు. అయితే అతని శిక్షణ ‘ఎ’ జట్టును రాటుదేలేలా చేసిందనడంలో సందేహం లేదు. తన తొలి అసైన్మెంట్లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో టెస్టుల్లో ఓడిన భారత ‘ఎ’ జట్టు... ఆ తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్లో, దక్షిణాఫ్రికా ‘ఎ’తో టెస్టు సిరీస్లో విజేతగా నిలిచింది. ఫలితాలకంటే యువ ఆటగాళ్లకు ఆడే అవకాశాలు రావడమే ఈ సిరీస్ల ముఖ్య ఉద్దేశమని చెప్పిన ద్రవిడ్ అందుకు తగినట్లుగా కుర్రాళ్లను గుర్తించి సానబెట్టే పనిలో పడ్డాడు. కరుణ్ నాయర్ భారత జట్టుకు ఎంపిక కావడం కుర్రాళ్ళలో స్ఫూర్తి నింపిందని రాహుల్ అభిప్రాయ పడ్డాడు. అసలు తొలి సిరీస్ కోసం ఫాస్ట్ పిచ్లు కావాలంటూ బోర్డును అడిగి మరీ తయారు చేయించుకోవడం ద్రవిడ్ భవిష్యత్ ఆలోచనలకు సూచన. విదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను ఆటగాళ్లు ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పట్టుదలగా ఉన్నాడనేది అర్థమవుతుంది. ఇక అండర్-19 జట్టుకు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఉండాలని ద్రవిడ్ కోరుతున్నాడు. భవిష్యత్తులో భారత జట్టులోకి వచ్చే ఆటగాళ్లంతా ‘ఎ’ జట్టు, అండర్-19 టీమ్లనుంచే రావాలి. వీరంతా ఇకపై ద్రవిడ్ శిక్షణలోనే సిద్ధం కానున్నారు. అంటే ఎవరు జట్టులోకి వచ్చినా ద్రవిడ్ ముద్ర, మార్క్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. చెలరేగిన సమిత్ ద్రవిడ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్కూల్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న గోపాలన్ క్రికెట్ చాలెంజ్ కప్ అండర్-12 టోర్నీలో అతను 93 పరుగులు చేసి తన జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ను గెలిపించాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో జరిగిన ఈ మ్యాచ్లో సమిత్ ఇన్నింగ్స్ కారణంగా అదితి 63 పరుగులతో గెలిచింది. అంతకు ముందు హారిజన్ పబ్లిక్ స్కూల్తో జరిగిన మ్యాచ్లోనూ సమిత్ 77 పరుగులు చేశాడు. ఈ అక్టోబర్తో సమిత్కు 10 ఏళ్లు నిండుతాయి. -
అచ్చం రాహుల్ ద్రవిడ్ లాగానే..
బెంగళూరు:టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలు అందించాడు. ఇటీవల ఇండియా-ఏ టీమ్ కు కోచ్ గా నియమితుడైన ద్రవిడ్.. అతని కుమారులు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ లకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పే పనిలో పడ్డాడు. వారు క్రికెట్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ లను వీక్షిస్తున్న ద్రవిడ్ వారికి దగ్గరుండి మరీ సలహాలు ఇస్తున్నాడు. అండర్ -12 స్కూల్ క్రికెట్ లో భాగంగా గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్ కు హాజరైన రాహుల్ ద్రవిడ్.. కుమారుడు సమిత్ బ్యాటింగ్ ను వీక్షించాడు. తండ్రి ఎదుట క్రికెట్ ఆడిన సమిత్ బ్యాటింగ్ లో మెరిశాడు. అచ్చం తండ్రి తరహాలోనే ఆడుతూ రాహుల్ ను మంత్ర ముగ్ధుడ్ని చేశాడు. మల్ల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరుపున ఆడిన సమిత్ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. దీంతో సమిత్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ టోర్నీకి ముందు జరిగిన టోర్నమెంట్ లో సమిత్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరి జూనియర్ ద్రవిడా?మజాకా?
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement