-
గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తి
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళం ముఖ్య భూమిక పోషిస్తోంది. గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది. విశాఖలోని ఇండియన్ నేవీ నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఏకశిలలో ఈ సాంకేతికత అభివృద్ధి జరిగింది. గ్యాస్ టర్బైన్ కంప్రెసర్ బ్లేడ్ల తయారీ ఇకపై మేడ్ ఇన్ ఇండియాగా రానున్నట్లు ఇండియన్ నేవీ చీఫ్ మెటీరియల్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నత్వానీ తెలిపారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావుతో కలిసి సందీప్ నత్వానీ ఐఎన్ఎస్ ఏకశిలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జీటీసీ బ్లేడ్ల తయారీకి సంబంధించిన డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఇకపై ఇతర ప్రాంతాలకు జీటీసీ బ్లేడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతులు రాబోతున్నాయని వైస్ అడ్మిరల్ నత్వానీ తెలిపారు. -
అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం
‘గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ’ ఇచ్చేందుకు యూఎస్ సుముఖత ♦ ద్వైపాక్షిక చర్చల్లో కీలకమలుపు: పారికర్ ♦ అన్ని రంగాల్లో భారత్కు సాయం: కార్టర్ వాషింగ్టన్: రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్తో జరిపిన భేటీలో.. కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు మైలురాయిగా నిలుస్తుందని కార్టర్ తెలిపారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహద పడుతుంది. భేటీ తర్వాత పారికర్, కార్టర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పారికర్ తెలిపారు. ప్రపంచ భద్రతకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యమే కీలకం కానుందన్నారు. రెండు దేశాల రక్షణ శాఖల మధ్య మరింత సహకారానికి బీజం పడిందన్నారు. కాగా, భారత్కు అన్ని రంగాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్టర్ తెలిపారు. అంతకుముందు.. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో పారికర్.. అమెరికా రక్షణ రంగ పరిశ్రమలతో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకోసం భారత్ నిబంధనల మార్పుకు చేస్తున్న ప్రయత్నాన్ని రక్షణ రంగ పరిశ్రమ ప్రముఖులు హర్షించారు. భారత్తో సంయుక్తంగా ఏహెచ్-64 అపాచి హెలికాప్టర్ల తయారీకి సిద్ధమని ఇటీవలే బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్లో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రానికి అమెరికా కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో.. ఇందుకోసం సదరు కంపెనీలకు ముందస్తు అనుమతి ఇచ్చేందుకు పెంటగాన్ సానుకూలంగా స్పందించింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement