-
కరీంనగర్ బస్టాండుకు రూ.5 లక్షలు తీసుకురండి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మేం మావోయిస్టులం మాట్లాడుతున్నాం.. పార్టీ చందా కోసం రూ.5 లక్షలు కావాలి. కరీంనగర్ బస్టాండుకు తీసుకురావాలి’అంటూ బెదిరించిన నకిలీ మావోలు పోలీసులకు చిక్కారు. ఇటీవల రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, పంకెన సర్పంచి శ్రీనివాస్కి మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల గుట్టును పోలీసులు ఛేదించారు. దీని వెనక మావోయిస్టులు లేరని, తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నలుగురు యువకులు పన్నిన పన్నాగమని తేల్చారు. శుక్రవారం భూపాలపల్లి పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. భూ పాలపల్లి జిల్లా పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సోమయ్య, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపెల్లికి చెందిన చిలుముల తిరుపతి, రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన ఈర్ల రాంచందర్ ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో నాయకులను బెదిరించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోదావరిఖనికి చెందిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు టేకుల సుదీర్ సాయం తీసుకున్నారు. యూట్యూబ్లో మావోయిస్టుల లెటర్హెడ్లను చూసి అలాంటివే నకిలీవి సృష్టించారు. పంకెన సర్పంచి శ్రీనివాస్, రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్లకు పార్టీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వాలని బెదిరిస్తూ లేఖలు పంపారు. ఈనెల 15వ తేదీన ఈ లేఖలను హైదరాబాద్ నుంచి పోస్టు చేశారు. రెండు రోజుల అనంతరం వారిద్దరికి ఫోన్ చేసి కరీంనగర్ బస్టాండుకు వచ్చి డబ్బులు అప్పగించాలని బెదిరించారు. దీనిపై సర్పంచి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి ముందు సోమయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగతావారిని అరెస్టు చేశారు. -
డబ్బు కోసం నకిలీ మావోయిస్టుగా..
మంచిర్యాల టౌన్ : అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ డిగ్రీ విద్యార్థి నకిలీ మావోయిస్టు అవతారమెత్డాడు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. చివరికి పోలీసులు పన్నిన వ్యూహంలో అడ్డంగా దొరికిపోయూడు. గురువారం మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. డబ్బు అవసరాలు.. పాత కక్షలతో.. చెన్నూర్ పట్టణంలోని మారెమ్మవాడకు చెందిన కొమటం మధూకర్ అలియాస్ మధు అలి యూస్ మదన్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిం చాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అలాగే తనకు గత సాధారణ, ప్రాదేశిక ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజాప్రతినిదులతో జరిగిన గొడవలతో వ్యక్తిగత కక్షలను పెంచుకున్న మధూకర్ నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు. అంతేకాకుండా తను కౌలు తీసుకున్న పొలంలో సాగు సమయంలో దాదాపు రూ.లక్షకు పైగా అప్పుల పాలయ్యాడు. అప్పులను తీర్చుకోవడం కోసం, పాత కక్షలతో ప్రజాప్రతినిధులను బెదిరించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మహారాష్ట్ర గడ్చిరోలి దళ కమాండర్ రామన్న పేరుతో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడమే లక్షంగా పెట్టుకున్నాడు. పార్టీ చందాగా రూ.లక్షలు డిమాండ్ ఈ క్రమంలో మంచిర్యాల కాలేజ్రోడ్లోని పాతగర్మిళ్లకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు అలాయాస్ భాస్కర్రావుతో పాటు ఆయన కుమారుడు భార్గవ్కు కూడా ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రావు ఫిబ్రవరి 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మధూకర్ చెన్నూర్కు చెందిన మరో ముగ్గురు ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టు పేరుతో బెదిరింపు ఫోన్లు చేశాడు. ఇందులో కోటపల్లి మండల జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో ఎన్నికల సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీ చందాగా రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే చెన్నూర్ ఎంపీపీ మైదం కళావతి భర్త మైదం రవితో జరిగిన గొడవలో కూడా అతనికి ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.5 లక్షలు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యుడు బత్తుల సమ్మయ్యతో జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకుని పార్టీ చందాగా కొంత మొత్తం డబ్బులు డిమాండ్ చేశాడు. వీరంతా పోలీసుల దర్యాప్తులో బాధితులుగా తేలారు. అంతా పక్షం రోజుల్లోనే... మంచిర్యాలకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు సీఐ వి.సురేశ్, పోలీస్ సిబ్బంది 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని గురువారం మంచిర్యాల గర్మిళ్లలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. కాగా, పాత కక్షలతో పాటు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తినట్లు విచారణలో మధూకర్ అంగీకరించాడు. అతడిని రిమాండ్కు పంపారు. -
నకిలీ మావోయిస్ట్ అరెస్ట్
అదిలాబాద్: జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి మావోయిస్టు అవతారం ఎత్తాడో వ్యక్తి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గురువారం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం కొమతంకు చెందిన ముధుకర్ అనే వ్యక్తి స్థానిక కాళాశాలలో డిగ్రి చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన మధుకర్ సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ మావోయిస్ట్ గా మారాలనుకున్నాడు. అంతే కొందరు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లను సేకరించాడు. దీంతో వారిని ఫోన్లలో బెదింరించడం ప్రారంభించాడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందిన దళ కమాండర్గా పరిచయం చేసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వల పన్ని మధుకర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల ఏఎస్పీ విజయ్కుమార్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. (మంచిర్యాల)
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement