లారీ బోల్తా క్లీనర్‌ మృతి | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా క్లీనర్‌ మృతి

Published Thu, Mar 9 2017 12:08 AM

lorry rolls and cleaner dies

యాడికి (తాడిపత్రి టౌన్‌) :  యాడికి మండలం వేములపాడు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడి క్లీనర్‌ మరణించగా, డ్రైవర్‌ గాయపడినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కర్ణాటక నుంచి సిమెంట్‌ లోడుతో చెన్నై బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని వేములపాడు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన క్లీనర్‌ విశాల్‌(20) అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement