సుమో బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

సుమో బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

Published Sat, Oct 24 2015 6:32 PM

8 inured as sumo overturns

రాపూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ) : పెంచలకోన పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా సుమో బోల్తాపడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం జరిగింది. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విమంగా ఉండడంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురికి రాపూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులందరూ వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లి సమీపంలోని జంగాలపల్లి గ్రామానికి చెందినవారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement