Breaking News

నీతి ఆయోగ్‌ సూచనతోనే ఆ నిర్ణయం: కేంద్ర మంత్రి

Published on Sat, 02/06/2021 - 14:53

సాక్షి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్ సూచనతోనే దేశవ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తున్నామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు కేంద్రం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తుందని.. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేజేషన్ ద్వారా ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉందన్నారు. (చదవండి: ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ)

మెట్రో, వాటర్, విద్యా రంగానికి చాలా కేటాయింపులు చేశామని.. తాముచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. నిధుల కోసం గత ఐదు నెలలుగా ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడానని తెలిపారు. పోలవరం కోసం ఏపీ ఆర్థిక మంత్రితో మాట్లాడి, అగ్రిమెంట్ మేరకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రాజెక్టులు కేటాయించామని తెలిపారు.(చదవండి: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా)

‘‘తెలంగాణలో 9172.90 వేలకోట్లకు పైగా నిధులు కేటాయించాం. ఆ రాష్ట్రానికి 400 కోట్లు ప్రతిఏటా ఆత్మనిర్భర భారత్ కింద వస్తాయి. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంది. భారత్ కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ఆపదలోనే అవకాశాలను వెతుక్కోవాలని ప్రధాని మోదీ అన్నారు. రెండు వ్యాక్సిన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాలకు ప్రధాని చేయూతనిచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించాం. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం అందించాం. ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నా బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం అదనపు కేటాయింపులు చేశాం. రైతులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెంచేందుకు అగ్రిసెస్‌ వసూలు చేస్తున్నామని’ అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.


 

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు