Breaking News

Telangana: పెన్షన్ రూ 4 వేలకు పెంపు!

Published on Sat, 02/28/2026 - 07:50

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం పింఛన్‌ సొమ్మును మరో రూ.వెయ్యి పెంచనున్నట్లు తెలుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. చేయూత పథకంలో భాగంగా దివ్యాంగులకు పింఛన్‌ రూ.3016 అందిస్తుండగా మరో వెయ్యి పెరిగే అవకాశం ఉంది. దీంతో రూ.4,016 పింఛన్‌ పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

వృద్ధాప్య, వితంతు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ వర్కర్లు, బీడీ టేకేదారులు, డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులు, ఒంటరి మహిళలు పొందుతున్న పింఛన్‌ రూ.2016 నుంచి రూ.3016కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని 36,754 మంది వృద్ధులు, 11,454మంది దివ్యాంగులు, 38,798 వితంతువులు, 278 మంది నేత కార్మికులు, 869 మంది గీత కార్మికులు, 2,467 మంది ఒంటరి మహిళలు, 2,335 మంది బీడీవర్కర్లు, 268 ఫైలేరియా, 172 డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులు, 15 మంది బీడీ టేకేదారులు మొత్తంగా 93,410 మందికి ప్రయోజనం కలుగనుంది. 

జిల్లాలో ప్రతీ నెల రూ.22.68 కోట్లు పింఛన్‌దారులకు అందుతోంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వాటినే కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తోంది. చాలామంది 57ఏళ్లు నిండిన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తుందా అని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)