Breaking News

సూర్యపేట గ్యాలరీ స్టాండ్‌ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే!

Published on Tue, 03/23/2021 - 11:25

సాక్షి, సూర్యాపేట‌: జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో ప్రేక్షకుల గ్యాలరీ స్టాండ్‌ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 150 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందంటూ బాధితులు, వారి బంధువులు విమర్శిస్తున్నారు. నాణ్యతా లోపంతో గ్యాలరీ నిర్మాణం జరిగిందని.. అందువల్లే ప్రమాదం చోటుచేసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్యాలరీ స్టాండ్‌ నిర్మాణంలో ఇనుప పైపులు వాడాల్సిన చోట కర్రలతో పని కానిచ్చారని.. అందవల్లే అది కుప్పకూలిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని చెప్తున్నారు. 

కాగా, మరో మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలు జరుగనుండటంతో గ్యాలరీలతో ప్రమాదమని తెలుసుకున్న నిర్వాహకులు.. వాటిని తొలిగించి.. నేలపై కూర్చునే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సోమవారం గ్యాలరీ ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు ప్రారంభించారు పోలీసులు. రెండు క్రేన్లు, 50 మంది సిబ్బందితో అక్కడకు చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. వీరందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక గ్యాలరీ నిర్మించిన శివసాయి డెకరేషన్స్‌పై కేసు నమోదు చేశారు.

ఎక్కువ మంది రావడంతో...
18 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో ఒకేసారి 1500 మంది వీక్షించేలా గ్యాలరీ స్టాండ్‌ను నిర్మించారు. కానీ పరిమితికి మించి 2000 మంది ప్రేక్షకులు రావడంతో గ్యాలరీ బేస్‌ అధిక బరువు తట్టుకోలేక కూలిపోయింది. గ్యాలరీ నిర్మాణంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్పష్టమవుతోంది. ఇనుప రాడ్లు వాడాల్సిన చోట కర్రలు కట్టడమే దీనికి నిదర్శనం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్‌.. 100 మందికి గాయాలు

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)