Breaking News

కరోనా వ్యాక్సిన్‌: కోటి డోసులు కావాలి

Published on Thu, 05/20/2021 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్‌ డోసులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. కోటి డోసుల కోసం స్వల్ప కాలిక టెండర్‌ను పిలిచింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) జారీ చేసిన ఈ టెండర్‌లో రాబోయే 6 నెలల కాలంలో ఈ డోసులు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ప్రతినెలా కనీసం 15 లక్షల డోసులు సరఫరా చేసే సామర్థ్యం టెండర్‌ వేసే సంస్థకు ఉండాలని పేర్కొంది.

ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టెండర్‌ను తమ సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపింది. అదే రోజు  సాయంత్రం ఆరున్నర గంటల నుంచి టెండర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. వచ్చేనెల 4వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు టెండర్లు దాఖలు చేయొచ్చని, అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు సాంకేతిక బిడ్స్‌ తెరవనున్నట్లు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రీబిడ్‌ మీటింగ్‌ను ఈనెల 26వ తేదీన జూమ్‌ మీటింగ్‌ ద్వారా నిర్వహించనున్నట్లు టెండర్‌ షెడ్యూల్‌లో పేర్కొంది.  

రాష్ట్రంలో మొత్తం 18–44 మధ్య వయసు వారందరికీ టీకాలు ఇవ్వాలంటే.. కనీసం మూడున్నర కోట్ల డోసులు అవసరం ఉంటుంది. అయితే కేంద్రం 45 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే టీకా డోసులు ఇస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56 లక్షల వరకు వ్యాక్సిన్‌ డోసులు వేయగా.. అందులో మొదటి డోసు తీసుకున్న వారు 42 లక్షల మంది.. రెండో డోసు తీసుకున్న వారు 12 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ డోసులు లేకపోవడంతో గత శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది.

రాష్ట్రంలో 1.86 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో, కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలోనూ వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది. 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )