Breaking News

అమ్మ ఆఖరికోరిక తీర్చిన తనయులు

Published on Sat, 02/07/2026 - 09:44

గాందీఆస్పత్రి : వైద్య విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం తల్లి పార్థివ దేహాన్ని సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు ఆమె కుమారులు. వివరాలు.. కరీంనగర్‌కు చెందిన సంగం మల్లీశ్వరీదేవి (76) ఐఎస్‌సదన్‌లోని ఇందిరా సేవసదన్‌ ఆనాథాశ్రమంలో పెరిగారు. అనంతరం స్థానిక  ఎయిడెడ్‌ పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేశారు. భర్త లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మృతి చెందగా, ఇద్దరు కుమారులు బాలాజీ, భరత్‌లతో చంపాపేట డివిజన్‌ ఎస్‌జీఆర్‌ కాలనీలో ఉంటున్నారు. మల్లీశ్వరీదేవి తన మరణానంతరం పార్థీవదేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనలకు అప్పగించాలని కుమారులను కోరారు.

 మల్లీశ్వరీదేవి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కుమారులు బాలాజీ, భరత్‌లు మల్లీశ్వరీదేవి పారి్ధవదేహాన్ని శుక్రవారం సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ అనాటమీ విభాగంలో మృతదేహానికి ఎంబామింగ్‌  చేసి భద్రపరిచారు. కార్యక్రమంలో గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రొ. ఇందిర, సూపరింటెండెంట్‌ ప్రొ. వాణి, ఆర్‌ఎంఓ–1 శేషాద్రి, అనాటమీ వైద్యులు, వైద్యవిద్యార్థులు, మల్లీశ్వరీదేవి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)