రియల్ సైకో! తొందర పడకు..
Breaking News
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్కు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. బోగీలు దగ్ధం
Nagarkurnool: బస్సు నడుస్తున్న సమయంలోనే ఊడిపోయిన చక్రాలు
Published on Mon, 09/06/2021 - 04:46
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ ఘటన ఆదివారం మార్చాలలో చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా తోటపల్లి నుంచి 20 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు కల్వకుర్తికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
దానిని వెనక్కి తీసుకురావడానికి కల్వకుర్తి డిపో నుంచి మరో బస్సు (ఏపీ 28జెడ్ 2271)ను అధికారులు పంపించారు. అయితే ఆ బస్సు మార్చాల సమీపంలోని కాటన్మిల్ వద్దకు చేరుకోగానే అకస్మాతుగా వెనుక ఉన్న రెండు చక్రాలు ఊడిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కకు నిలిపివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు అందులో ప్రయాణికులెవరూ లేరు.
#
Tags : 1