Breaking News

ప్రతి 9 మందిలో ఒకరికి అంటువ్యాధుల లక్షణాలు!

Published on Sun, 11/09/2025 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అంటువ్యాధులకు దారితీసే కారకాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఏప్రిల్‌–జూన్‌ మధ్య 2,26,095 మందిలో పరీక్షించిన నమూనాల్లో 26,055 (11.5 శాతం) మందిలో ఇన్ఫెక్షన్‌ కారకాలను గుర్తించారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త విశ్లేషణలో భాగంగా పరీక్షలు జరిపిన ప్రతి 9 మందిలో ఒకరు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఐసీఎంఆర్‌కు చెందిన వైరస్‌ పరిశోధన, డయాగ్నొస్టిక్‌ లేబోరేటరీస్‌ (వీఆర్‌డీఎల్‌) నెట్‌వర్క్‌ ద్వారా ప్రజారోగ్యానికి సంబంధించిన వైరల్‌ ఇన్ఫెక్షన్లను ట్రాక్‌ చేయడం లక్ష్యంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న అంటువ్యాధుల క్రమాన్ని ఇది ఎత్తిచూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఇదీ అధ్యయనం... 
దేశంలో ఐదు రకాల సాధారణ వ్యాధికారకాలను (పాథోజెన్‌లను) గుర్తించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ఇన్‌ఫ్లుయెంజా–ఎ, జ్వరం కేసుల్లో డెంగీ, పచ్చకామెర్ల విషయంలో హెపటైటిస్‌–ఎ, డయేరియా కేసుల పెరుగుదలకు నోరో వైరస్, ఎన్‌సెఫలైటిస్‌ కేసుల్లో హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌లను గుర్తించారు. వాటికి సంబంధించి మరింత విస్తారంగా పరిశోధించగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో (ఏఆర్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ) ఇన్‌ఫ్లుయెంజా–ఎ, తీవ్ర జ్వరం, రక్తస్రావం, జ్వరం కేసుల్లో డెంగీ వైరస్, కామెర్ల కేసుల్లో హెపటైటిస్‌–ఎ, తీవ్ర డయేరియా (ఏడీడీ) వ్యాప్తిలో నోరోవైరస్, తీవ్ర ఎన్‌సెఫలైటిస్‌ సిండ్రోమ్‌ (ఏఈఎస్‌) కేసుల్లో హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ (హెచ్‌ఎస్‌వీ) ఉన్నట్లు గుర్తించారు.

2025 తొలి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 10.7%గా ఉన్న ఇన్ఫెక్షన్‌ రేటు రెండో త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 11.5%కి పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. తొలి త్రైమాసికంలో పరీక్షించిన 2,28,856 నమూనాలకుగాను 24,502 నమూనాల్లో వ్యాధికారక కారకాలు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాతి త్రైమాసికంలో 2,26,095 సేకరించిన నమూనాలకుగాను 26,055 నమూనాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది 0.8 శాతం పాయింట్ల పెరుగుదలను సూచించింది. ఈ పెరుగుదల స్వల్పంగా కనిపించినప్పటికీ ఇది కాలానుగుణ వ్యాప్తికి లేదా కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లకు ముందస్తు సంకేతం కావచ్చని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నిరంతర నిఘా ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుందని చెబుతున్నారు. ‘ఇన్ఫెక్షన్‌ రేటులో స్వల్పమార్పులు కూడా సంభావ్య అంటువ్యాధులకు ముందస్తు హెచ్చరికగా ఉపయోగపడతాయి. వీఆర్‌డీఎల్‌ నెట్‌వర్క్‌ భారత్‌లో ముందస్తు గుర్తింపు వ్యవస్థగా కీలక పాత్ర పోషిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు.  

ముఖ్యాంశాలు... 
ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య 191 వ్యాధి సమూహాలను పరిశోధించారు. 
గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా, డెంగీ, చికున్‌గున్యా, రోటావైరస్, నోరోవైరస్, వరిసెల్లా జోస్టర్‌ వైరస్, ఈబీవీ, ఆస్ట్రోవైరస్‌ వంటి ఇన్ఫెక్షన్‌లను గుర్తించారు. 

జనవరి–మార్చి మధ్య 389 సమూహాలను పరిశీలించి హెపటైటిస్, ఇన్‌ఫ్లుయెంజా, లెప్టోస్పిరా, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వంటి సారూప్య వ్యాధికారకాలను కనుగొన్నారు. 
2014 నుంచి 2024 వరకు వీఆర్‌డీఎల్‌ నెట్‌వర్క్‌ 40 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించింది. వాటిలో 18.8%లో వ్యాధికారకాలను గుర్తించింది. 
2014లో 27 ప్రయోగశాలల నుంచి 2025 నాటికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 165 ప్రయోగశాలలకు దేశవ్యాప్తంగా 2,534 వ్యాధి సమూహాలను ట్రాక్‌ చేశారు. 

మరింత పర్యవేక్షణ ఆవశ్యకత... 
ప్రజారోగ్య ప్రాముఖ్యతగల వైరల్‌ ఇన్ఫెక్షన్లను గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన ఈ అధ్యయనం సంక్రమణ ధోరణులను మరింతగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని చాటిచెబుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ అధ్యయనం కాలానుగుణ వ్యాధులు, కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లకు హెచ్చరికగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇన్ఫెక్షన్‌ రేట్లలో త్రైమాసిక మార్పులను ట్రాక్‌ చేస్తుంటే భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధులను సకాలంలో నివారించవచ్చని సూచిస్తున్నారు.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)