Breaking News

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

Published on Wed, 11/27/2024 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం..మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 

సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్‌ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజూ నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు.  

అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఉపేక్షించొద్దు 
అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యలు తలెత్తకుండా తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తుండడంపై రైతులు ఆనందంతో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. 

’రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్‌ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఆ ధాన్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 30న మహబూబ్‌నగర్‌లో రైతు పండగను జరుపబోతున్నాం. దీన్ని కలెక్టర్లు విజయవంతం చేయాలి’ అని సీఎం కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)