నల్లమలలో అరుదైన చింకారా

Published on Thu, 09/05/2024 - 04:26

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాజూకైన శరీరం, బెదురు కళ్లు, రింగులు తిరిగిన కొమ్ములతో కృష్ణజింకలను పోలి ఉండే చింకారా అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి. దేశంలో అరుదుగా కన్పి0చే ఈ ఇండియన్‌ గజల్‌ ఎక్కువగా గుజరాత్‌లో కొంతభాగం విస్తరించిన థార్‌ ఎడారితో పాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పిస్తాయి. 

ఇలాంటి అరుదైన చింకారాల గెంతులకు నల్లమల అటవీప్రాంతం నెలవైంది. నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని మద్దిమడుగు రేంజ్‌లో పదుల సంఖ్యలో చింకారాలు ఉన్నాయి. అయితే అతి సున్నితమైన చింకారాల మనుగడకు వేట, మానవసంచారం రూపంలో ముప్పు పొంచి ఉంది.  

అంతరించిపోతున్న దశలో చింకారా జాతి 
దేశంలోనే అరుదైన చింకారా జాతి జింకలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. దట్టమైన అడవిలో కాకుండా పూర్తిగా గడ్డి మైదానాలు, పొదలతో కూడిన అడవుల్లో నివసించేందుకే చింకారాలు ఇష్టపడతాయి. జనావాసాలు, మనుషులకు ఇవి దూరంగా ఉంటాయి. మనుషులు కన్పిస్తే చాలు భయంతో బెదిరిపోతాయి. 

చిన్నచిన్న శబ్దాలకు కూడా గజగజ వణికిపోతాయి. అతి సున్నితమైన ఈ జీవులకు వేట, మానవ సంచారం, ఇతర జంతువులతో ముప్పు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో చింకారాలు కీలకంగా పని చేస్తాయి. ఈ ప్రాంతాల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు, వేటను నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

చింకారాలు అతి సున్నితమైనవి 
దేశంలో అరుదైన చింకారాలు నల్లమలలో ఉన్నాయి. జింక జాతికి చెందిన ఈ ప్రాణులు అతి సున్నితమైనవి. మనుషులు కని్పస్తే బెదిరిపోతాయి. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యంలో వీటి పాత్ర కీలకం. నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.  – రోహిత్‌ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్‌ జిల్లా

జనసంచారం, ఆవుల మందలతో ముప్పు
నల్లమలలోని మద్దిమడుగు అటవీరేంజ్‌ పరిధిలో చింకారాల ఉనికి కన్పిస్తుండగా, ఈ ప్రాంతంలో జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. 

నల్లమలలో వేలసంఖ్యలో వదులుతున్న ఆవుల మందలతో కూడా చింకారాలకు ముప్పు పొంచి ఉంది. చిన్నచిన్న మొక్కలు, నేలపై తక్కువ ఎత్తులో ఉండే గడ్డి మాత్రమే చింకారాల ఆహారం కాగా, ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సంచరిస్తున్న ఆవుల మందలతో ఆహారపు పోటీ నెలకొంది. ఆవులను మేపేందుకు స్థానిక గ్రామాల నుంచి కాకుండా నల్లగొండలోని కంబాలపల్లి, చందంపేట పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఆవుల మందలను కృష్ణాతీరంలోని నల్లమలలో వదులుతున్నారు. 

జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే జూనోసిస్‌ వ్యాధులకు చింకారాలు లోనయ్యే అవకాశం ఉంది. అరుదైన చింకారాల సంరక్షణకు అటవీశాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

Videos

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

తుక్కుగూడలో దారుణం.. ఆ రోజు రాత్రి జరిగింది ఇదే పోలీస్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

విజయవాడలో CPS ఉద్యోగుల భారీ ర్యాలీ

కర్నూలులో ఉగ్రవాది అరెస్ట్.. చిన్న తప్పుతో దొరికేశాడు

శివుడి త్రిశూలం నుంచి పుట్టిన దేశం, నేపాల్ అసలు కథ ఇదే!

బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర

పుష్ప శ్రీవాణిపై పోలీసుల ఓవరాక్షన్ చీర లాగి దురుసు ప్రవర్తన..

పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలు!

పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్

గాలి భాను ప్రకాష్ క్వారీలపై రోజా సంచలన వ్యాఖ్యలు

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)