Breaking News

వందేభారత్‌లో త్వరలో స్లీపర్‌ బెర్తులు

Published on Sun, 01/15/2023 - 01:10

సాక్షి, హైదరాబాద్‌: సెమీ బుల్లెట్‌ రైలుగా పరిగణిస్తున్న వందేభారత్‌ రైలు త్వరలో సరికొత్త మార్పులతో రాబోతోంది. ప్రస్తుతం చైర్‌ కార్‌కే పరిమితమైన ఈ రైల్లో.. స్లీపర్‌ బెర్తులు ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఈ రైళ్లను తయారుచేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)కి ఆదేశాలివ్వడంతో ఈమేరకు రూపకల్పన పనులు మొదలయ్యాయి.

ప్రస్తుతం వందేభారత్‌ 2.0 సిరీస్‌ నడుస్తోంది. మొదటిసిరీస్‌లో ఐదు రైళ్లు పట్టాలెక్కగా, రెండో విడతలో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య సోమవారం నుంచి (ఆదివారం లాంఛనంగా ప్రారంభంకానుంది) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైలు కూడా రెండో సిరీస్‌లో భాగం. తదుపరి లేదా ఆ పై సిరీస్‌ అందుబాటులోకి వచ్చే నాటికి స్లీపర్‌ బెర్తులతో కూడిన వందేభారత్‌ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. 

ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే  
వందేభారత్‌ రైలుకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నా, కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే ఉంటోంది. వీటిలో స్లీపర్‌ బెర్తులు లేకపోవటంతో అవి రాత్రి వేళ తిరగవు. దీంతో గమ్యం చేరేవరకు కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. గతంలో వందేభారత్‌ తరహాలో వచ్చిన ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైలుకు ఎంతో డిమాండ్‌ ఉండేది.

ఐదేళ్ల క్రితం కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య తిరిగేందుకు డబుల్‌ డెక్కర్‌ రైలు మంజూరైంది. బెర్తులు లేక పోవటంతో పూర్తిగా పగటివేళ తిరుగుతుండటంతో దీనిలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం లోపే నమోదయ్యేది. క్రమంగా నష్టాలు పెరగటంతో దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వందేభారత్‌ విషయంలోనూ ఈ ప్రమాదం పొంచి ఉండటంతో అందులో స్లీపర్‌ బెర్తులు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. 

విశాఖకు కొంత మెరుగే.. 
హైదరాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది. అదే వందేభారత్‌ రైలు మధ్యాహ్నం మూడింటికి బయలుదేరి రాత్రి 11.30 గంటలకల్లా గమ్యం చేరుతుంది. కానీ విశాఖ నుంచి ఆ రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అంటే పూర్తిగా పగటి వేళలోనే తిరుగుతుంది. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శనివారం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోపాటు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వందేభారత్‌లోనూ పరిశీలించారు.   

ధర ప్రభావం చూపుతుందేమో.. 
సికింద్రాబాద్‌–విశాఖ వందేభారత్‌లో ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.3,120గా ఉంది. ఇందులో రూ.369 కేటరింగ్‌ చార్జి కలిసి ఉంది. అది వద్దనుకుంటే దాన్ని మినహాయించి టికెట్‌ జారీ చేస్తారు. అదే విశాఖకు వెళ్లే గోదావరిలో ఏసీ ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.2,540 మాత్రమే. దురంతోలో రూ.2,795, ఫలక్‌నుమాలో రూ.2,465గా ఉంది. ఇవన్నీ స్లీపర్‌ బెర్తులుండే రైళ్లు.

వీటి కంటే చైర్‌కార్‌లో వెళ్లే వందేభారత్‌ రైలు టికెట్‌ ధర చాలా ఎక్కువగా ఉండటం కూడా కొంత ప్రభావం చూపుతుందంటున్నారు. వందేభారత్‌ ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,665గా ఉంటే, గోదావరిలో థర్డ్‌ ఏసీ ధర రూ.1080, ఫలక్‌నుమాలో రూ.1,045 మాత్రమే. వాటిల్లో స్లీపర్‌ క్లాస్‌ ధర రూ.450 మాత్రమే కావటం గమనార్హం. అయితే మిగిలిన రైళ్లతో పోలిస్తే.. వందేభారత్‌ రైలు ప్రయాణ సమయం తక్కువగా ఉంటుంది.   

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)