Breaking News

బాబోయ్‌ సంక్రాంతి.. బస్ టికెట్‌ ధర రూ.5 వేలకు పైమాటే

Published on Fri, 01/10/2025 - 14:02

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాతికి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఝలక్‌ ఇస్తున్నాయి. ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా టికెట్‌ ధరల్ని అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిన టికెట్‌ ఛార్జీలు పెంచినా రవాణా శాఖ అధికారులు  నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారుని  ప్రయాణికులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.

పండుగ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఆర్టీసీ బస్సుల కంటే రెండు నుంచి మూడుంతలు అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అడ్డగోలుగా పెంచిన ఛార్జీలతో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఒక్కో కుటుంబం రూ.15 వేల నుంచి 20,000 చెల్లించాల్సి వస్తుంది. ఏపీలోని విజయవాడ, గుంటూరు తిరుపతి, పాలకొల్లు, విశాఖపట్నం, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి వెళ్లేందుకు ఒక్కో టికెట్‌పై రెండు నుంచి మూడు వేలు పెరగడంపై ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

గతంలో రూ.1000 రూపాయలు, రూ.1200 ఉన్న టికెట్ తాజాగా రూ.3000 పైమాటే ఉంది. భీమవరం వెళ్లే ప్రయాణికుల నుంచి రూ. 3000 నుంచి రూ.4000, రాజమండ్రికి  రూ. 3500 నుంచి రూ.4000 చెల్లించాల్సి వస్తుంది. ఇందేంటని ప్రశ్నిస్తే.. పండగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయింపుపై ప్రయాణికులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అధిక ధర

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)