Breaking News

హోటల్‌ బిజినెస్‌ డల్‌

Published on Tue, 06/11/2024 - 06:51

సాక్షి, హైదరాబాద్‌: హోటల్‌ ఫుడ్‌పై వినియోగదారుల్లో నమ్మకం పోయింది. హైదరాబాద్‌ సహా తెలంగాణలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నాయని తేలడంతో బయటి ఆహారం తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఫుడ్‌సేఫ్టీ అధికారుల అంచనా ప్రకారం ఈ దాడుల అనంతరం ఏకంగా 30 శాతం హోటల్‌ బిజినెస్‌ తగ్గింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా ఫుడ్‌ డెలివరీ కూడా భారీగా తగ్గిందని తెలుస్తోంది.  

ఆన్‌లైన్‌ డెలివరీల ద్వారా మరింత నాసిరకం ఫుడ్‌ సరఫరా 
ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతలోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్టు సమాచారం. పాడైపోయి, కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో పేరుమోసిన హోటళ్లు, బేకరీలు, ఐస్‌క్రీం సెంటర్లున్నాయి. ప్రముఖ హోటళ్లలో పాడైపోయిన ఆహారపదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్‌ సేఫ్టీ రూల్స్‌ కూడా సరిగ్గా పాటించడం లేదు.

 ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌ ఆధ్వర్యంలోని టాస్‌్కఫోర్స్‌ బృందాలు విడుదల చేసిన జాబితా ప్రకారం క్రీమ్‌స్టోన్, న్యాచురల్స్‌ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీహౌస్, షాగౌస్, కామత్‌ హోటల్, 36 డౌన్‌టౌన్‌ బ్రూపబ్, మాకౌ కిచెన్‌ అండ్‌ బార్, ఎయిర్‌లైవ్, టాకోబెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్‌ జో, ఖాన్‌సాబ్, హోటల్‌ సుఖ్‌సాగర్, జంబో కింగ్‌ బర్గర్స్, రత్నదీప్‌ స్టోర్, రెస్ట్‌ ఓ బార్‌ వంటి అనేక హోటళ్లు, బేకరీలు ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పదార్థాలతో వండటం వంటి వాటిని గుర్తించారు. 

రోజుల తరబడిగా నిల్వ ఉంచిన మాంసంతో వండటం వంటివీ గుర్తించారు. హైదరాబాద్‌లో సగం హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని, అపరిశుభ్రమైన కిచెన్‌ వంటివి ఉన్నాయని నిర్థారించారు. కేసులు పెట్టి జరిమానాలు విధించడంతోపాటు శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు నేరుగా హాటల్‌కు లేదా రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల కంటే, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల ద్వారా అత్యంత నాసిరకమైన ఫుడ్‌ వినియోగదారులకు సరఫరా చేశారని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

దాడులేనా.. సీజ్‌ చేయరా...? 
ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేసి ప్రజల్లో ఒకరకమైన భయం సృష్టించారు. అయితే కుటుంబసభ్యులతో సరదాగానో లేదా అవసరంరీత్యానో హాటళ్లకు వెళ్లే వినియోగదారులకు భరోసా కలి్పంచడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల సమయంలో కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఆహారం వంటివి గుర్తించినా, తక్షణమే ఆయా హోటళ్లను ఎందుకు సీజ్‌ చేయడం లేదని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు. కేవలం కేసులు పెట్టి వదిలేయడం, పద్ధతి మార్చుకోవాలని సమయం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని వాపోతున్నారు.  

భరోసా కలి్పంచకపోతే ఎలా? 
హోటళ్లపై దాడులు చేశాక, వాటిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మార్పు రాదు. హోటళ్లలో ధైర్యంగా తినేలా వినియోగదారులకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు హోటల్‌ యజమానులపైనా ఉంది. వేలాది రూపాయలు వసూలు చేసే పెద్ద హోటళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్‌ చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే కిచెన్‌లోకి వెళ్లి చూసేలా వెసులుబాటు ఉండాలి. లేదంటే ఓపెన్‌ కిచెన్‌ కానీ, సీసీ టీవీ కెమెరాల ద్వారా కిచెన్‌లో ఉండే పదార్థాలు, వండే విధానం వంటి వాటిని తినేవారు నేరుగా స్క్రీన్‌పై చూసే వెసులుబాటు కలి్పంచాలి.         
 శ్రీనివాస్‌ శెట్టి, హైదరాబాద్‌

సీజ్‌ చేసే అధికారం మాకు లేదు  
హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశాక. వాటిని సీజ్‌ చేసే అధికారం మాకు లేదు. కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం వరకే మాపని. అయితే తక్షణమే సీజ్‌ చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది. వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తున్నాం. హోటల్, రెస్టారెంట్ల యజమానులను పిలిపించి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం.  
– ఆర్‌వీ కర్ణన్, కమిషనర్, ఫుడ్‌ సేఫ్టీ

పెద్ద హోటళ్లే ఇలా చేయడం విస్మయం కలిగిస్తుంది 
పెద్ద హోటళ్లే నాసిరకం ఫుడ్‌ పెట్టడంతో డాక్టర్లతో సహా వినియోగదారులంతా విస్మయానికి గురయ్యారు. వీకెండ్‌లో కుటుంబాలతో వెళాదామనుకునే వారికి షాక్‌ ఇచ్చారు. నాసిరకం, కలర్స్‌ వాడిన ఆహారం, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆహార ప్రియులకు భరోసా కలి్పంచాలి.  
– డాక్టర్‌ అనిల్‌కుమార్‌ మన్నవ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి  

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు