Breaking News

బీఆర్‌ఎస్‌ వల్లే భారీ నష్టం

Published on Fri, 01/02/2026 - 06:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలకు మరణ శాసనం రాసిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారని విమర్శించారు. నదీ జిలాల విషయంలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వీలుగా గురువారం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, ప్రజాప్రతినిధులకు ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఏపీతో అలయ్‌ బలయ్‌ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఉత్తమ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే ‘పాలమూరు’ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం శుద్ధ అబద్ధమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లు దాటుతుందని చెప్పారు. 2015లో కేవలం రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, కానీ డీపీఆర్‌ తయారు చేసే నాటికి దానిని రూ. 55 వేల కోట్లకు పెంచారని వివరించారు. అది కూడా కాలువల నిర్మాణం, భూ సేకరణ అంశం అందులో లేకుండా చేశారని చెప్పారు.  

బీఆర్‌ఎస్‌ రూ.27 వేల కోట్లే ఖర్చు చేసింది.. 
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం రూ. 27 వేల కోట్లు మాత్రమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అదే రెండేళ్ల కాంగ్రెస్‌ హయాంలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2013లో ప్రతిపాదించినట్టు జూరాల వద్దనే నీటిని తీసుకుని ఉంటే వ్యయం తగ్గేదని అన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)