పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు

Published on Thu, 01/26/2023 - 07:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మొత్తం 1.20 లక్షల మందిలో పోషకాహార లోపం ఉందని తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ (గణాంక నివేదిక)–2022 వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 19.79 లక్షల మంది పిల్లలు ఉంటే, అందులో 6.09 శాతం మంది పోషకాహార (న్యూట్రిషన్‌) లోపంతో బాధపడుతున్నారు. 1.83 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. 

కాగా 12.18 లక్షల మంది పిల్లలు న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు (అదనపు పోషకాలు) తీసుకుంటున్నారు. అత్యధి కంగా సిద్దిపేట జిల్లాలో 78.4 శాతం మంది పిల్లలు సప్లిమెంటరీలు తీసుకుంటుండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 20.9 శాతం మంది తీసుకుంటున్నారు.2021–22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.92 లక్షల మంది తల్లులు సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ కింద నమోదయ్యారు. అందులో 2.58 లక్షల మంది న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. న్యూట్రిషన్‌ సప్లిమెంటరీలు తీసుకునేవారిలో అత్యధికంగా జగిత్యాలలో 62.9 శాతం మంది ఉండగా, అత్యంత తక్కువగా కామారెడ్డి జిల్లాలో 26.9 శాతం మంది ఉన్నారు. 

97,448 మందికి కేసీఆర్‌ కిట్‌...
రాష్ట్రంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి 97,448 మందికి కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకం 2017 జూన్‌ రెండో తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మాతృత్వ, శిశు మరణాల రేటును తగ్గించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడిపిల్ల పుడితే రూ.13 వేలు తల్లులకు అందజేస్తున్నారు. అలాగే టవళ్లు, సబ్బులు, పౌడర్‌తో కూడిన కిట్‌ను కూడా ఇస్తున్నారు.  

నివేదికలోని ముఖ్యాంశాలు...
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (ఎన్‌ఎఫ్‌ హెచ్‌ఎస్‌–5) ప్రకారం రాష్ట్రంలో 6–59 నెలల మధ్య చిన్నారుల్లో 70 శాతం మంది రక్తహీన తతో బాధపడుతున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం అది 60.7 శాతంగా ఉంది. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం రాష్ట్రంలో 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల గర్భిణుల్లో 53.2 శాతం మందిలో రక్తహీనత నమోదయ్యింది. 
అన్ని కేటగిరీలకు చెందిన 15–49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 57.6 శాతం మంది, పురుషుల్లో 15.3 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 
మహిళల్లో అత్యంత తీవ్రమైన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఉన్నవారు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం 3.9 శాతం మంది ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 7 శాతం ఉన్నారు. 
పురుషుల్లో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం అత్యంత తీవ్రమైన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఉన్నవారు 4.1 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం రెట్టింపునకు పైగా 9.3 శాతం ఉన్నారు. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం మహిళల్లో మధ్యస్తం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 1.7 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం ఏకంగా 6.3 శాతం ఉన్నారు. 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4 ప్రకారం పురుషుల్లో మధ్యస్థం నుంచి తీవ్రమైన బీపీ ఉన్నవారు 3.5 శాతం ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 ప్రకారం 8.1 శాతం ఉన్నారు. 
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1.33 లక్షల మంది ఉన్నారు.
చదవండి: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా?

Videos

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)